Mahesh Babu : ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నరాజమౌళి ఇప్పుడు మహేష్ సినిమా కోసం సన్నద్ధం అవుతున్నారు. ఈ మూవీపై కూడా అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు కోసం రాజమౌళి ఎలాంటి కథ సిద్ధం చేస్తున్నారు.. ఎంత బడ్జెట్.. ఇలాంటి ఆసక్తికర చర్చ అభిమానుల్లో మొదలైంది. మహేష్, రాజమౌళి తొలి కలయికలో రాబోతున్న చిత్రం ఇది. ఈ చిత్రం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉండబోతున్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. విజయేంద్ర ప్రసాద్ కూడా తాను ఈ స్టోరీ లైన్ పైనే వర్క్ చేస్తున్నట్లు.. మరికొన్ని ప్రత్యామ్నాయ కథలు కూడా ఉన్నట్లు తెలిపారు.
అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి రాజమౌళి మాట్లాడుతూ.. ఇది బిగ్ స్క్రీన్ ఎంటర్టైనర్గా ఉండబోతోంది. బలమైన ఎమోషనల్ కోర్తో పూర్తిగా ఆకట్టుకునే యాక్షన్ అడ్వెంచర్ అవుతుంది. మహేష్ లార్జర్ ద్యాన్ లైఫ్ ప్రాజెక్ట్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. వారికి తప్పక అదిరిపోయే ఫీస్ట్ ఇస్తానని అన్నారు రాజమౌళి. మరోవైపు.. మహేష్ బాబు సర్కారు వారి పాట ఒక పాట మినహా షూటింగ్ను ముగించారు. తాజాగా మేకర్స్ ట్విట్టర్లో ఒక ప్రకటన విడుదల చేయడం ద్వారా అదే విషయాన్ని ధృవీకరించారు. ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ను పరశురామ్ తెరకెక్కించారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్ కథానాయికగా నటించింది.
రాజమౌళి ప్రాజెక్ట్తోపాటు మహేష్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో పూజా హెగ్డెతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. ఇక రాజమౌళి సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మహేష్ సరసన హిందీ హీరోయిన్ అలియా భట్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమాలో సీత పాత్రలో నటించిన ఆలియా భట్ మరోసారి రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో హీరోయిన్గా నటించనుందని అంటున్నారు. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…