Raghuvaran : తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు రఘువరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన దక్షిణాదిలో ఎన్నో భాషలకు చెందిన చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. విలన్ అనే పదం అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చే పేర్లలో రఘువరన్ ఒకటి. ఈయన తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ భాషలకు చెందిన చిత్రాల్లో నటించారు. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన సుమారుగా 200కు పైగా మూవీల్లో నటించారు. ఈయన తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని కలిగి ఉండేవారు. డైలాగ్స్ డెలివరీలోనూ తనదైన స్టైల్ ఈయనకు సొంతం.
రఘువరన్ జన్మించింది కేరళలోని కొల్లెన్ గోడే అనే ప్రాంతంలో. ఈయన 1979 నుంచి యాక్టింగ్ చేయడం మొదలు పెట్టారు. 1996లో ప్రముఖ నటి, డబ్బింగ్ ఆర్టిస్టు రోహిణిని వివాహం చేసుకున్నారు. ఇక ఈయన తెలుగులోనూ అనేక చిత్రాల్లో నటించారు. తన సొంత మ్యానరిజాన్ని కలిగి ఉండేవారు. ఈయన తెలుగులో చేసిన శివ ఎంతగానో పేరు తెచ్చి పెట్టింది. ఆర్జీవీ ఈయనలోని కొత్త తరహా విలన్ను బయటకు తెచ్చారు. అప్పటి నుంచి అదే మ్యానరిజంతో విలన్గా రఘువరన్ కొనసాగారు.
తెలుగులో రఘువరన్ శివ, ఆహా, సుస్వాగతం, నాగ, జానీ, నాని, మాస్ వంటి చిత్రాల్లో నటించారు. చివరి సారిగా ఆటాడిస్తా మూవీలో నటించారు. ఇక సుస్వాగతం మూవీలో ఈయన తండ్రి పాత్రలో జీవించారు. కొడుకును అమితంగా ప్రేమించే తండ్రిగా ఈయన అద్భుతంగా నటించారు. అయితే 2004లో రఘువరన్.. రోహిణికి విడాకులు ఇచ్చారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
అయితే రఘువరన్ రోజులో 24 గంటలూ మత్తులో ఉండేవాడని.. డ్రగ్స్కు బానిస అయ్యాడని.. కనుకనే రోహిణి ఆయనకు విడాకులు ఇచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయనకు ఎంత చెప్పినా డ్రగ్స్ తీసుకోవడం మానలేదట. దీంతో రోహిణి ఆయనకు విడాకులు ఇచ్చారు. అయితే రఘువరన్ 2008 మార్చి 19న కన్నుమూశారు. ఇక రఘువరన్ అలా డ్రగ్స్కు బానిస అయ్యేందుకు ఆయన లవ్ ఫెయిల్యూరే కారణమని తెలుస్తోంది. ఆయన అప్పట్లో నటి అమలను అమితంగా ప్రేమించారట. కానీ ఆమె మాత్రం నో చెప్పిందట. కనుకనే ఆయన తీవ్ర మనస్థాపం చెంది డ్రగ్స్కు బానిస అయ్యారు. ఆ తరువాత రోహిణితో వివాహం అయినా.. కుదురుగా ఉండలేదు. కనుకనే వారు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్లకు రఘువరన్ చనిపోయారు. అమల వల్లే ఆయన కెరీర్ అలా నాశనం అయిందని అంటుంటారు. ఇక ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…