Mallika Sherawat : బాలీవుడ్ బ్యూటీ మల్లికా శెరావత్ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. హీరోలు తెల్లవారుజామున 3 గంటలకు పిలిచినా వెళ్లాల్సిందేనని.. లేకపోతే సినిమా నుంచి తీసేస్తారని.. సంచలన కామెంట్స్ చేసింది. బాలీవుడ్పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు గళం విప్పారు. ఇప్పుడు వారి సరసన మల్లికా శెరావత్ చేరింది. ఆమె తాజాగా ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను తెలియజేసింది.
మర్డర్ మూవీ ద్వారా ఫేమస్ అయిన మల్లికా శెరావత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ అప్పట్లో సంచలనం సృష్టించింది. తరువాత కూడా మల్లికా అలాంటి పాత్రల్లోనే నటించింది. అయితే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. దీపికా పదుకొనె ఇటీవల నటించిన గెహ్రాయియా చిత్రాన్ని తానెప్పుడో 15 ఏళ్ల కిందటే చేశానని చెప్పింది.
బాలీవుడ్లో ఎ-లిస్టర్ హీరోలు ఏం అడిగినా కాంప్రమైజ్ అవకూడదు. ఒకవేళ కాంప్రమైజ్ కాకపోతే పరిస్థితులు మరోలా ఉంటాయి. ఇక్కడ మరోలా అంటే.. అర్థం ఏమిటో మీరు ఊహించుకోవచ్చు. అదే కాంప్రమైజ్ అయితే వారి సర్కిల్లో ఉంటారు. వారి సినిమాల్లో అవకాశాలు వస్తాయి. వారు నిలబడమన్నా, కూర్చోమన్నా, ఏం చెప్పినా చేయాలి. హీరో తెల్లవారు జామున 3 గంటలకు పిలిచినా సరే వెళ్లాలి. లేదంటే సినిమా నుంచి తీసేస్తారు. తరువాత అవకాశాలు కూడా రావు.. అంటూ మల్లికా సంచలన వ్యాఖ్యలు చేసింది.
కాగా మల్లికా శెరావత్ తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన రోల్స్లో నటించింది. చాలా వరకు ఈమె చేసినవన్నీ బోల్డ్ పాత్రలే. ఇక ఆమె ఇంటర్నేషనల్ స్టార్ జాకీ చాన్తో ఒక సినిమాలో నటించింది. అలాగే అమెరికా అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాను రెండు సార్లు కలిసే చాన్స్ ను దక్కించుకుంది. అయితే మల్లికా శెరావత్ ఇప్పుడు సంచలన కామెంట్స్ చేయడంతో ఆమె మరోమారు వార్తల్లో నిలిచింది. దీనికి బాలీవుడ్ వర్గాలు ఏమని స్పందిస్తాయో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…