Puri Jagannadh : గత కొన్ని సంవత్సరాల వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రహీరోయిన్ గా కొనసాగిన ఛార్మి కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న ఛార్మి గత కొద్దికాలం నుంచి సినిమాలలో హీరోయిన్ గా నటించడం లేదు. అయితే ఆమె తెరపై సందడి చేయకున్నప్పటికీ తెర వెనుక ఎంతో బిజీగా ఉందని చెప్పవచ్చు.
ప్రస్తుతం నిర్మాతగా మారిన చార్మి.. పూరీ జగన్నాథ్ తో కలిసి పలు చిత్రాలను నిర్మిస్తూ ఎంతో బిజీగా ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి హీరోయిన్ గా తెరకెక్కిన జ్యోతిలక్ష్మి చిత్రం ద్వారా పూరీ జగన్నాథ్, చార్మి మధ్య ఎంతో చనువు పెరిగిపోయింది. ఈ క్రమంలోనే వీరిద్దరి గురించి అప్పట్లో పెద్దఎత్తున వార్తలు హల్ చల్ చేశాయి. అయితే వీరి గురించి వస్తున్న ఇలాంటి వార్తలపై చార్మి, పూరీ ఎప్పుడూ స్పందించలేదు.
తాజాగా పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ రొమాంటిక్ సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆకాష్.. చార్మి, పూరీ మధ్య అందరూ అనుకున్నటువంటి ఏ సంబంధం లేదని, వారిద్దరి మధ్య వేరే బంధం ఉందని స్పష్టత ఇచ్చాడు.
నాన్న సినిమా షూటింగ్ లో ఉంటే ఏ విషయం గురించీ పట్టించుకోరు. అయితే నాన్నకు ఏం కావాలో ఛార్మికి బాగా తెలుసని చార్మి నాన్న పక్కన ఉండటం వల్ల నాన్నకు ఎంతో పని ఒత్తిడి తగ్గిందని ఈ సందర్భంగా ఆకాష్ వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలియజేశాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…