Prudhvi Raj : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైనప్పటి నుంచి ఆయన ఆధ్వర్యంలో ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. మరోవైపు ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై ఎలాంటి పోరాటం చేయలేదు. దీంతో ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే అలాంటి విమర్శలకు చెక్ పెట్టేలా మంచు విష్ణు ప్రస్తుతం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఇటీవల మా సభ్యులకు ఏఐజీ హాస్పిటల్స్ సహకారంతో ప్రత్యేక మెడికల్ క్యాంప్ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
6 నెలల్లో మా అసోసియేషన్ బిల్డింగ్ కు భూమి పూజ చేస్తామని మంచు విష్ణు ఈ సందర్భంగా అన్నారు. అలాగే టిక్కెట్ల ధరలపై కూడా అందరూ కలసి కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుందని అన్నారు. ఇక ఇదే కార్యక్రమంలో కమెడియన్ పృథ్వి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంచు విష్ణును పొగడ్తల్లో ముంచెత్తారు. మంచు విష్ణు ఒక ప్లానింగ్ ఉన్న వ్యక్తి అని.. ఆయన ఏం చేసినా ఒక ప్లాన్ ప్రకారం చేస్తారని అన్నారు.
మంచు విష్ణు ఇప్పటికే తమకు ఉన్న విద్యాసంస్థలను ఎంతో సులభంగా నిర్వహిస్తున్నారని.. కనుక మా అసోసియేషన్ను నిర్వహించడం అతనికి పెద్ద కష్టమేమీ కాదని.. చాలా సులభంగా పనిచేయగలడని అన్నారు. ఇక పృథ్వి ఇటీవలే మెగాస్టార్ చిరంజీవిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మొదటి నుంచి మెగా ఫ్యామిలీ అభిమానినే అని.. కొందరి ప్రోద్బలం వల్ల వారికి వ్యతిరేకంగా వెళ్లాల్సి వచ్చిందని.. తను మెగాస్టార్ ఆదుకోవాలని ఆయన కోరారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…