Prudhvi Raj : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైనప్పటి నుంచి ఆయన ఆధ్వర్యంలో ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. మరోవైపు ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై ఎలాంటి పోరాటం చేయలేదు. దీంతో ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే అలాంటి విమర్శలకు చెక్ పెట్టేలా మంచు విష్ణు ప్రస్తుతం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఇటీవల మా సభ్యులకు ఏఐజీ హాస్పిటల్స్ సహకారంతో ప్రత్యేక మెడికల్ క్యాంప్ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
6 నెలల్లో మా అసోసియేషన్ బిల్డింగ్ కు భూమి పూజ చేస్తామని మంచు విష్ణు ఈ సందర్భంగా అన్నారు. అలాగే టిక్కెట్ల ధరలపై కూడా అందరూ కలసి కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుందని అన్నారు. ఇక ఇదే కార్యక్రమంలో కమెడియన్ పృథ్వి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంచు విష్ణును పొగడ్తల్లో ముంచెత్తారు. మంచు విష్ణు ఒక ప్లానింగ్ ఉన్న వ్యక్తి అని.. ఆయన ఏం చేసినా ఒక ప్లాన్ ప్రకారం చేస్తారని అన్నారు.
మంచు విష్ణు ఇప్పటికే తమకు ఉన్న విద్యాసంస్థలను ఎంతో సులభంగా నిర్వహిస్తున్నారని.. కనుక మా అసోసియేషన్ను నిర్వహించడం అతనికి పెద్ద కష్టమేమీ కాదని.. చాలా సులభంగా పనిచేయగలడని అన్నారు. ఇక పృథ్వి ఇటీవలే మెగాస్టార్ చిరంజీవిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మొదటి నుంచి మెగా ఫ్యామిలీ అభిమానినే అని.. కొందరి ప్రోద్బలం వల్ల వారికి వ్యతిరేకంగా వెళ్లాల్సి వచ్చిందని.. తను మెగాస్టార్ ఆదుకోవాలని ఆయన కోరారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…