Amitabh Bachchan : బాలీవుడ్ సీనియర్ మోస్ట్ నటుడు అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించాయి. బిగ్బీగా ఈయనను అందరూ పిలుచుకుంటారు. కేవలం హిందీ మాత్రమే కాదు.. దక్షిణాది వారికి కూడా అమితాబ్ బచ్చన్ సినిమాలు అంటే ఆసక్తి ఉంటుంది. ఇక ఈయనతో వర్మ చేసిన సర్కార్ మూవీ అయితే ఒక రేంజ్లో సంచలనం సృష్టించింది. కాగా బిగ్బీ ప్రస్తుతం సినిమాలతోపాటు టీవీ షోస్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన సోషల్ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటారు.
అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఏదో ఒక విషయంపై పోస్టులు పెడుతుంటారు. అయితే ఆయన పెట్టే పోస్టులపై కొన్ని సార్లు ఆయనపై ట్రోల్స్, విమర్శలు వస్తుంటాయి. కరోనా సమయంలో ఆయన ఖరీదైన కారు కొంటే.. ఒక వైపు ప్రజలు ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతుంటే.. మీరు కారు కొని షికారు చేయాలా.. ఇలాంటి పోస్టులు పెట్టడం అవసరమా.. అని నెటిజన్లు కౌంటర్ ఇచ్చారు. ఇక ఆయనకు కోవిడ్ సోకి హాస్పిటల్ చేరినప్పుడు పోస్టులు పెడితే.. ఆయన చనిపోవాలని కోరుకుంటున్నామని.. కొందరు ఆయనను దారుణంగా విమర్శించారు. ఇక ఇప్పుడు కూడా ఆయనను కొందరు నెటిజన్లు అలాగే విమర్శిస్తున్నారు.
అమితాబ్ బచ్చన్ లేటెస్ట్గా ఓ పోస్ట్ పెట్టారు. అందులో గుడ్ మార్నింగ్ అని ఉంది. సాధారణంగా ఇలాంటి పోస్టులను ఉదయం 9 లోపే పెట్టాలి. కానీ ఆయన ఉదయం 11.30 గంటలకు పెట్టారు. దీంతో నెటిజన్లకు మళ్లీ ఆయుధం లభించినట్లు అయింది. దీంతో నెటిజన్లు ఆయనపై మరోమారు విరుచుకుపడుతున్నారు. ఆయనను ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఇప్పుడు టైం ఎంతైంది.. ఇప్పుడా గుడ్ మార్నింగ్ చెప్పేది.. అని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేయగా.. ఒక నెటిజన్ మాత్రం బిగ్బీని అవమానించాడు. ఆయనను.. ముసలోడా.. ఇది మధ్యాహ్నం.. అని అన్నాడు. ఇలా ఆ నెటిజన్ దారుణంగా అమితాబ్ను అవమానించాడు.
అయితే అమితాబ్ అందుకు స్పందించారు. మీరు చాలా కాలం బతకాన్ని కోరుకుంటున్నా.. కానీ మిమ్మల్ని ఎవరూ ముసలోడు.. అని పిలవొద్దని ఆశిస్తున్నా.. అంటూ దీటుగా బదులిచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం బ్రహ్మాస్త్ర, గుడ్బై, ప్రాజెక్ట్ కె, బటర్ఫ్లై వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా…
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…