Tollywood : గత కొంత కాలంగా టాలీవుడ్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఓటీటీల ప్రభావం వల్ల.. సినిమాలు బాగున్నప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. కొన్ని రోజులు పోతే ఓటీటీల్లోనే చూడవచ్చు కదా.. అని భావిస్తున్నారు. దీంతో సినిమాలకు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మంచి సినిమా అని ముద్ర వేసుకున్నా కలెక్షన్లు మాత్రం రావడం లేదు. దీంతో నిర్మాతలు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమాలకు భారీగా నష్టాలు వస్తున్నాయి.
సినిమా టిక్కెట్ల ధరలను పెంచితే థియేటర్లకు ప్రేక్షకులు వస్తారని భావించారు. కానీ అలా జరగలేదు. మొదటికే మోసం వచ్చింది. అంతకు ముందు కన్నా ఇప్పుడే థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గింది. దీంతో తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్లను నిలిపివేయాలని ప్రముఖ నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్త సెన్సేషన్ను సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖ నిర్మాతలు ఇదే విషయంపై గత కొద్ది రోజులుగా సమాశాలు నిర్వహిస్తూ.. చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎట్టకేలకు షూటింగ్లను నిలిపివేయాలని నిర్ణయానికి వచ్చారు.
అయితే ఎప్పటి వరకు షూటింగ్లను నిలిపివేస్తారు.. అన్న విషయంపై మాత్రం వారు స్పష్టతను ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం ఉన్న సమస్యలన్నింటినీ చర్చించి పరిష్కరించాకే షూటింగ్లను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు. ఏది ఏమైనా కరోనా అనంతరం సినిమా రంగ పరిస్థితులు దారుణంగా మారాయి. కలెక్షన్లు లేక థియేటర్లు, నిర్మాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి పరిష్కారం కనుగొంటారో.. లేదో.. చూడాలి.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…