Samantha : టాలీవుడ్లో క్యూట్ కపుల్గా ఉన్న సమంత, నాగచైతన్య గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. వీరిద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో ఈ విషయాన్ని వేర్వేరుగా ప్రకటించారు. దీంతో ఈ విషయం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. అసలు వీరు ఎందుకు విడిపోదామనుకున్నారో తెలియక చాలా మంది ఇప్పటికీ అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే నాగచైతన్యపై తనకు ఎంత కోపం ఉందనే విషయాన్ని సమంత పరోక్షంగా తెలియజేసింది. ఇటీవలే కాఫీ విత్ కరణ్ అనే షోలో పాల్గొన్న ఈమె కనీసం చైతన్య పేరును పలికేందుకు కూడా ఇష్టపడలేదు. పైగా తమ విడాకులు అంత కూల్ గా ఏమీ అవలేదని తెలిపింది. అంటే.. విడాకుల కోసం వీరి మధ్య పెద్ద యుద్ధమే జరిగినట్లు ఈ అమ్మడు చెప్పకనే చెప్పింది. దీంతో సమంత కామెంట్స్ వైరల్ అయ్యాయి.
అయితే సమంత వ్యాఖ్యలకు అక్కినేని కుటుంబం నుంచి ఎవరూ స్పందించలేదు. కనీసం ఆమె కామెంట్స్ను ఖండించలేదు. వారందరూ.. ఆఖరికి చైతన్య కూడా సమంత కామెంట్స్పై ఏమీ మాట్లాడలేదు. అయితే ఇదిలా ఉండగా.. తాజాగా ఒక వార్త దుమారం రేపుతోంది. ఓ బాలీవుడ్ హీరో వల్లే సమంతకు చైతన్య విడాకులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్ రెచ్చగొట్టడం వల్లే చైతన్య సమంతకు విడాకులు ఇచ్చాడని ఓ వార్త వైరల్ అవుతోంది.
చూడు బ్రదర్.. నీకు సమంతకు, సెట్ కాదు, నా మాట విను.. నీ మనస్సు అంతా చీకటిగా ఉంది.. నువ్వు విడాకులు ఇవ్వడమే కరెక్ట్.. అని అమీర్ఖాన్.. చైతన్యతో అన్నాడట. దీంతో చైతూ సమంతకు విడాకులు ఇచ్చాడట. అలా అని చెప్పి ఒక వార్త అయితే తెగ వైరల్ అవుతోంది. అయితే దీన్ని పోస్ట్ చేసింది మరెవరో కాదు.. బాలీవుడ్ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్. ఈయన ఎల్లప్పుడూ వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంటాడు. తన దగ్గర అమీర్ఖాన్, నాగచైతన్యలకు చెందిన స్టోరీ మొత్తం ఉందని.. చైతన్య విడాకులకు అమీర్ఖానే కారణమని ఆయన అన్నారు. దీంతో ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…