Prawns Masala Curry : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది అనేక రకాల నాన్ వెజ్ వంటకాలను తింటుంటారు. చికెన్, మటన్, చేపలతోపాటు రొయ్యలను కూడా తింటారు. రొయ్యలతో వేపుడు, బిర్యానీ చేస్తారు. కానీ రొయ్యలతో ఎంతో ఘాటైన మసాలా కూరను కూడా చేయవచ్చు. ఇది అన్నం లేదా చపాతీలు.. ఎందులోకి అయినా సరే రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా సులభమే. మసాలా రొయ్యల కూరను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా రొయ్యల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
శుభ్రం చేసిన పచ్చి రొయ్యలు – 1 కప్పు, పసుపు, మిరియాల పొడి – అర టీస్పూన్ చొప్పున, ఉప్పు – తగినంత, నిమ్మరసం – 2 టీస్పూన్లు, జీలకర్ర – 2 టీస్పూన్లు, నూనె – అర కప్పు, ఆవాలు – అర టీస్పూన్, కరివేపాకు – 2 రెబ్బలు, ఉల్లిపాయ, టమాటా – 1 చొప్పున, అల్లం – చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు – ఆరు, పచ్చి మిర్చి – 2, ధనియాల పొడి – ఒకటిన్నర టీస్పూన్, పలుచని చింత పండు రసం – 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా – అర టీస్పూన్.
మసాలా రొయ్యల కూరను తయారు చేసే విధానం..
రొయ్యలపైన పావు టీస్పూన్ చొప్పున పసుపు, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. స్టవ్ మీద కడాయి పెట్టి అది వేడయ్యాక జీలకర్ర వేయించుకుని చల్లారాక పొడి చేసి పెట్టుకోవాలి. అదే కడాయిలో ఒక టీస్పూన్ నూనె వేసి ఆవాలు, కరివేపాకు వేయించాలి. 2 నిమిషాలయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి తరుగు వేయాలి. అవి వేగాక మిగిలిన పసుపు, ధనియాల పొడి, ముప్పావు వంతు జీలకర్ర పొడి వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసి ఉడికించాలి. తరువాత రొయ్యలు, చింతపండు నీళ్లు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇది దగ్గరగా ఉడికిన తరువాత గరం మసాలా పొడి, మిగిలిన జీలకర్ర పొడి వేసి కలిపి దింపేయాలి. దీంతో ఎంతో రుచికరమైన మసాలా రొయ్యల కూర రెడీ అవుతుంది. ఇది అన్నం లేదా చపాతీలు.. ఎందులోకి అయినా సరే బాగుంటుంది. తరచూ రొయ్యలను వండుకునే వారు ఇలా ఓసారి ట్రై చేయండి.. కొత్త టేస్ట్ను ఆస్వాదించవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…