Pragya Jaiswal : కంచె చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. తాజాగా నందమూరి నటసింహం బాలయ్య బాబు, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సక్సెస్ఫుల్ కాంబోలో రాబోతున్న మాస్ ఎంటర్టైనర్ అఖండలో కథానాయికగా నటించింది. ఈ సినిమా కోసం ప్రగ్యా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
అయితే రీసెంట్గా ఈ అమ్మడు కరోనా బారిన పడింది. నేను కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాను. నాకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాను. ఇంతకు ముందు కరోనా బారిన పడ్డాను. ఇప్పడు మళ్లీ కరోనా వచ్చింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్లో ఉన్నాను అని చెప్పుకొచ్చింది. ప్రగ్యాకి కరోనా అని చెప్పడంతో ఆమె టీం అంతా ఆందోళన చెందారు.
తాజాగా ప్రగ్యా జైస్వాల్ గుడ్ న్యూస్ చెప్పింది. నెగిటివ్ అనే పదం ఇప్పటి వరకు తన జీవితంలో ఎప్పుడూ తనను సంతోష పెట్టలేదు.. అంటూ ట్వీట్ చేసింది ప్రగ్యా జైస్వాల్. అంటే తనకు కరోనా నెగెటివ్ అని కన్ఫాం అయిందని తెలుస్తోంది. కాగా.. అక్టోబర్ 10వ తేదీన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ప్రగ్యాకి కరోనా నెగెటివ్ అని తేలడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…