Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అతని కుటుంబం ప్రస్తుతం తీరని శోకంలో ఉన్నారు. ప్రభాస్ పెదనాన్న సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆదివారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండె పోటుతో మరణించారు. కృష్ణంరాజు అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. టాలీవుడ్ ప్రముఖులు సైతం కృష్ణం రాజు మృతికి సంతాపం తెలిపారు.
తన వెన్నంటే ఉండి ముందుకు నడిపించిన పెదనాన్న దూరం కావడంతో పెద్ద దిక్కు కోల్పోయాను అంటూ ప్రభాస్ కుమిలి కుమిలి ఏడ్చిన దృశ్యం అందర్నీ కలచివేసింది. ప్రభాస్ ని ఇంత బాధలో చూసి అభిమానులు కూడా తట్టుకోలేకపోయారు. ఈ విషాద సమయంలో ప్రభాస్ కి కాస్త ఊరట కలిగించే మంచి వార్త వచ్చింది. ప్రభాస్ కి అరుదైన ఆహ్వానం అందింది.
దేశ రాజధాని ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో దసరా పర్వదినం రోజు జరిగే రావణదహనం కార్యక్రమానికి హాజరు కావాలని రామ్ లీలా కమిటీ సభ్యులు ఆహ్వానం పంపించారు. దసరా ఉత్సవాలకు ప్రభాస్ను విశిష్ట అతిథిగా హాజరుకావాలని రామ్ లీలా కమిటీ సభ్యులు కోరారు. వారి ఆహ్వానం మేరకు ప్రభాస్కు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు వార్త విన్పిస్తుంది. గతంలో రావణ దహనం కార్యక్రమానికి అజయ్ దేవగన్, జాన్ అబ్రహం వంటి నటులు హాజరు కాగా.. ఈ ఏడాది ప్రభాస్కు ఆహ్వానం అందడంతో డార్లింగ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బాహుబలి మూవీతో పాన్ ఇండియా వైడ్ గా ప్రభాస్కు భారీగా క్రేజ్ ఏర్పడింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో పౌరాణిక గాథ రామాయణం ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఆదిపురుష్ చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఈ సినిమాను ఐదు భాషల్లో అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్తో ఆదిపురుష్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మూవీ మేకర్స్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీరాముడి గెటప్ లో ప్రభాస్ ఎలా ఉండబోతాడో అనే ఉత్కంఠతో అభిమానులు ఎదురు చూస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…