Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అతని కుటుంబం ప్రస్తుతం తీరని శోకంలో ఉన్నారు. ప్రభాస్ పెదనాన్న సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆదివారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండె పోటుతో మరణించారు. కృష్ణంరాజు అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. టాలీవుడ్ ప్రముఖులు సైతం కృష్ణం రాజు మృతికి సంతాపం తెలిపారు.
తన వెన్నంటే ఉండి ముందుకు నడిపించిన పెదనాన్న దూరం కావడంతో పెద్ద దిక్కు కోల్పోయాను అంటూ ప్రభాస్ కుమిలి కుమిలి ఏడ్చిన దృశ్యం అందర్నీ కలచివేసింది. ప్రభాస్ ని ఇంత బాధలో చూసి అభిమానులు కూడా తట్టుకోలేకపోయారు. ఈ విషాద సమయంలో ప్రభాస్ కి కాస్త ఊరట కలిగించే మంచి వార్త వచ్చింది. ప్రభాస్ కి అరుదైన ఆహ్వానం అందింది.
దేశ రాజధాని ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో దసరా పర్వదినం రోజు జరిగే రావణదహనం కార్యక్రమానికి హాజరు కావాలని రామ్ లీలా కమిటీ సభ్యులు ఆహ్వానం పంపించారు. దసరా ఉత్సవాలకు ప్రభాస్ను విశిష్ట అతిథిగా హాజరుకావాలని రామ్ లీలా కమిటీ సభ్యులు కోరారు. వారి ఆహ్వానం మేరకు ప్రభాస్కు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు వార్త విన్పిస్తుంది. గతంలో రావణ దహనం కార్యక్రమానికి అజయ్ దేవగన్, జాన్ అబ్రహం వంటి నటులు హాజరు కాగా.. ఈ ఏడాది ప్రభాస్కు ఆహ్వానం అందడంతో డార్లింగ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బాహుబలి మూవీతో పాన్ ఇండియా వైడ్ గా ప్రభాస్కు భారీగా క్రేజ్ ఏర్పడింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో పౌరాణిక గాథ రామాయణం ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఆదిపురుష్ చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఈ సినిమాను ఐదు భాషల్లో అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్తో ఆదిపురుష్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మూవీ మేకర్స్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీరాముడి గెటప్ లో ప్రభాస్ ఎలా ఉండబోతాడో అనే ఉత్కంఠతో అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…