Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అతని కుటుంబం ప్రస్తుతం తీరని శోకంలో ఉన్నారు. ప్రభాస్ పెదనాన్న సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆదివారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండె పోటుతో మరణించారు. కృష్ణంరాజు అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. టాలీవుడ్ ప్రముఖులు సైతం కృష్ణం రాజు మృతికి సంతాపం తెలిపారు.
తన వెన్నంటే ఉండి ముందుకు నడిపించిన పెదనాన్న దూరం కావడంతో పెద్ద దిక్కు కోల్పోయాను అంటూ ప్రభాస్ కుమిలి కుమిలి ఏడ్చిన దృశ్యం అందర్నీ కలచివేసింది. ప్రభాస్ ని ఇంత బాధలో చూసి అభిమానులు కూడా తట్టుకోలేకపోయారు. ఈ విషాద సమయంలో ప్రభాస్ కి కాస్త ఊరట కలిగించే మంచి వార్త వచ్చింది. ప్రభాస్ కి అరుదైన ఆహ్వానం అందింది.
దేశ రాజధాని ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో దసరా పర్వదినం రోజు జరిగే రావణదహనం కార్యక్రమానికి హాజరు కావాలని రామ్ లీలా కమిటీ సభ్యులు ఆహ్వానం పంపించారు. దసరా ఉత్సవాలకు ప్రభాస్ను విశిష్ట అతిథిగా హాజరుకావాలని రామ్ లీలా కమిటీ సభ్యులు కోరారు. వారి ఆహ్వానం మేరకు ప్రభాస్కు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు వార్త విన్పిస్తుంది. గతంలో రావణ దహనం కార్యక్రమానికి అజయ్ దేవగన్, జాన్ అబ్రహం వంటి నటులు హాజరు కాగా.. ఈ ఏడాది ప్రభాస్కు ఆహ్వానం అందడంతో డార్లింగ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బాహుబలి మూవీతో పాన్ ఇండియా వైడ్ గా ప్రభాస్కు భారీగా క్రేజ్ ఏర్పడింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో పౌరాణిక గాథ రామాయణం ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఆదిపురుష్ చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఈ సినిమాను ఐదు భాషల్లో అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్తో ఆదిపురుష్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మూవీ మేకర్స్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీరాముడి గెటప్ లో ప్రభాస్ ఎలా ఉండబోతాడో అనే ఉత్కంఠతో అభిమానులు ఎదురు చూస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…