Prabhas : దుఃఖ స‌మ‌యంలో ప్ర‌భాస్‌కు ఊర‌ట‌ను అందించే వార్త‌.. ఫ్యాన్స్ హ్యాపీ..

September 14, 2022 10:03 AM

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అతని కుటుంబం ప్రస్తుతం తీరని శోకంలో ఉన్నారు. ప్రభాస్ పెదనాన్న సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆదివారం తుదిశ్వాస విడిచారు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండె పోటుతో మరణించారు. కృష్ణంరాజు అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. టాలీవుడ్ ప్రముఖులు సైతం కృష్ణం రాజు మృతికి సంతాపం తెలిపారు.

తన వెన్నంటే ఉండి ముందుకు నడిపించిన పెదనాన్న దూరం కావడంతో పెద్ద దిక్కు కోల్పోయాను అంటూ  ప్రభాస్ కుమిలి కుమిలి  ఏడ్చిన దృశ్యం అందర్నీ కలచివేసింది.  ప్రభాస్ ని ఇంత బాధలో చూసి అభిమానులు కూడా తట్టుకోలేకపోయారు. ఈ విషాద సమయంలో ప్రభాస్ కి  కాస్త ఊరట కలిగించే మంచి వార్త వచ్చింది. ప్రభాస్ కి అరుదైన ఆహ్వానం అందింది.

Prabhas has been invented for dasara festival at delhi
Prabhas

దేశ రాజధాని ఢిల్లీలో రామ్‌ లీలా మైదానంలో దసరా పర్వదినం రోజు జరిగే రావణదహనం కార్యక్రమానికి హాజరు కావాలని రామ్‌ లీలా కమిటీ సభ్యులు ఆహ్వానం పంపించారు. దసరా ఉత్సవాలకు ప్రభాస్‌ను విశిష్ట అతిథిగా హాజరుకావాలని రామ్‌ లీలా కమిటీ సభ్యులు కోరారు. వారి ఆహ్వానం మేరకు ప్రభాస్‌కు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు వార్త విన్పిస్తుంది. గతంలో రావణ దహనం కార్యక్రమానికి అజయ్ దేవగన్, జాన్ అబ్రహం వంటి నటులు  హాజరు కాగా.. ఈ ఏడాది ప్రభాస్‌కు ఆహ్వానం అందడంతో డార్లింగ్ అభిమానులు సంతోషం  వ్యక్తం చేస్తున్నారు.

బాహుబలి మూవీతో పాన్ ఇండియా వైడ్ గా ప్రభాస్‌కు భారీగా క్రేజ్ ఏర్పడింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో పౌరాణిక గాథ రామాయణం ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రంలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఆదిపురుష్ చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాను ఐదు భాషల్లో అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆదిపురుష్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మూవీ మేకర్స్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీరాముడి గెటప్ లో ప్రభాస్ ఎలా ఉండబోతాడో అనే ఉత్కంఠతో అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now