Prabhas : బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. ఆ మూవీల అనంతరం ఆయన నటించిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాప్ కాగా.. హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ప్రభాస్ ఫ్లాప్, హిట్ సంగతి పక్కన పెడితే రెమ్యునరేషన్ను మాత్రం భారీగానే తీసుకుంటున్నాడట. ఒక్క సినిమాకే ఆయన రూ.120 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. గతంలో ఆయన రూ.100 కోట్లు తీసుకునేవారు. కానీ రాధే శ్యామ్ ఫ్లాప్ అయినా రూ.20 కోట్లు పెంచి రూ.120 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడట. దీంతో ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరోలలో ఒకడిగా ప్రభాస్ నిలిచారు.
అయితే రూ.120 కోట్లు అయినా సరే ప్రభాస్కు ఇచ్చి ఆయనతో సినిమా చేసేందుకు నిర్మాతలు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఎందుకంటే ఆయన సినిమా యావరేజ్ టాక్ వచ్చినా చాలు.. భారీగా లాభాలు వస్తాయి. కనీసం రూ.1000 కోట్లు కలెక్ట్ అవుతాయి. కనుకనే అంత మొత్తం ఇచ్చి మరీ ఆయనతో నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 5 సినిమాలు ఉండగా.. వాటికి ఆయన రూ.600 కోట్ల వరకు రెమ్యునరేషన్ను అందుకోనున్నారు. ఈ క్రమంలోనే ఆ మొత్తంతో ప్రభాస్ ఏం చేయనున్నారనేది హాట్ టాపిక్ అవుతోంది.
ప్రభాస్ తాను సంపాదించే మొత్తంతో దుబాయ్ లేదా సింగపూర్ వంటి దేశాల్లో హోటల్స్ను పెట్టాలని చూస్తున్నారట. ఇందుకు గాను ఆయన ప్రస్తుతం కొందరితో కలసి ప్లాన్స్ వేస్తున్నారని సమాచారం. హోటల్ రంగంలోకి అడుగు పెట్టాలని ప్రభాస్ చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న వివరాలు మాత్రం తెలియలేదు. కానీ అంత మొత్తం వస్తే ఎవరైనా సరే కచ్చితంగా ఏదో ఒక బిజినెస్లో పెట్టుబడి పెడతారు. మరి ప్రభాస్ ఏం బిజినెస్ చేస్తారో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…