Prabhas : బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. ఆ మూవీల అనంతరం ఆయన నటించిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాప్ కాగా.. హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ప్రభాస్ ఫ్లాప్, హిట్ సంగతి పక్కన పెడితే రెమ్యునరేషన్ను మాత్రం భారీగానే తీసుకుంటున్నాడట. ఒక్క సినిమాకే ఆయన రూ.120 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. గతంలో ఆయన రూ.100 కోట్లు తీసుకునేవారు. కానీ రాధే శ్యామ్ ఫ్లాప్ అయినా రూ.20 కోట్లు పెంచి రూ.120 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడట. దీంతో ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరోలలో ఒకడిగా ప్రభాస్ నిలిచారు.
అయితే రూ.120 కోట్లు అయినా సరే ప్రభాస్కు ఇచ్చి ఆయనతో సినిమా చేసేందుకు నిర్మాతలు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఎందుకంటే ఆయన సినిమా యావరేజ్ టాక్ వచ్చినా చాలు.. భారీగా లాభాలు వస్తాయి. కనీసం రూ.1000 కోట్లు కలెక్ట్ అవుతాయి. కనుకనే అంత మొత్తం ఇచ్చి మరీ ఆయనతో నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 5 సినిమాలు ఉండగా.. వాటికి ఆయన రూ.600 కోట్ల వరకు రెమ్యునరేషన్ను అందుకోనున్నారు. ఈ క్రమంలోనే ఆ మొత్తంతో ప్రభాస్ ఏం చేయనున్నారనేది హాట్ టాపిక్ అవుతోంది.
ప్రభాస్ తాను సంపాదించే మొత్తంతో దుబాయ్ లేదా సింగపూర్ వంటి దేశాల్లో హోటల్స్ను పెట్టాలని చూస్తున్నారట. ఇందుకు గాను ఆయన ప్రస్తుతం కొందరితో కలసి ప్లాన్స్ వేస్తున్నారని సమాచారం. హోటల్ రంగంలోకి అడుగు పెట్టాలని ప్రభాస్ చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న వివరాలు మాత్రం తెలియలేదు. కానీ అంత మొత్తం వస్తే ఎవరైనా సరే కచ్చితంగా ఏదో ఒక బిజినెస్లో పెట్టుబడి పెడతారు. మరి ప్రభాస్ ఏం బిజినెస్ చేస్తారో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…