Posani : గత రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్, పోసాని కృష్ణమురళిల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో భాగంగా వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అటు వైసీపీ నాయకులు, ఇటు పోసాని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు పోసానిని టార్గెట్ చేస్తూ గత మూడు రోజుల నుంచి ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ అన్న మాటలకు తప్పులేదు కానీ తను మాట్లాడిన మాటలకు తప్పు ఉందా అంటూ పోసాని ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రెస్ మీట్ పెట్టారో లేదో అలా తనపై పవన్ అభిమానులు దాడికి దిగారని అన్నారు. ఏకంగా తన ఇంటిపై రాళ్ల దాడి కూడా చేశారన్నారు. తన ఇంటిపై దాడి అనంతరం మరోసారి పవన్ కళ్యాణ్ పై పోసాని నిప్పులు చెరిగారు.
పవన్ కళ్యాణ్ అన్న మాటలకు మెగాస్టార్ చిరంజీవి ఆ వ్యాఖ్యలను ఖండించ వచ్చు కదా అంటూ.. ఈ సందర్భంగా పోసాని అన్నారు. 1981 నుంచి రాజకీయాల్లో ఉన్నానని. ఇలాంటి బెదిరింపులకు, దాడులకు తను ఏమీ భయపడనని.. పవన్ కళ్యాణ్ ను తానే చెప్పుతో కొడతా అని, మహా అయితే ఏం చేస్తారు ? చంపేస్తారా.. అభిమానులకు డబ్బులు ఇచ్చి నా పై దాడికి ఉసిగొల్పడం ఏంటి ? అని ఈ సందర్భంగా పోసాని ప్రశ్నించారు. రాజకీయంగా తనను ఏమన్నా పట్టించుకోను.. కానీ ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ.. ఈ సందర్భంగా పోసాని మరోసారి పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…