Posani Krishna Murali : పవన్ వర్సెస్ వైసీపీ నుంచి పవన్ వర్సెస్ పోసానిగా మారిన మాటల యుద్ధం చివరకు దాడుల వరకు వెళ్లింది. పవన్ అభిమానులు పోసానిపై దాడులు చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. పోసాని ఇంటిపై బుధవారం అర్థరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఇదే విషయమై పోసాని ఇంటి వాచ్ మెన్ మాట్లాడుతూ.. అర్థరాత్రి సమయంలో కొందరు పోసాని ఇంటిపై రాళ్ల దాడి చేశారని, దీంతో ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయని అన్నాడు. అయితే ఈ ఘటనపై వాచ్మెన్ ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీనిపై స్థానికులు స్పందిస్తూ.. అర్థరాత్రి సమయంలో రాళ్ల దాడి జరగడంతో భయాందోళనలకు గురయ్యామని తెలిపారు. పవన్ కల్యాణ్ అభిమానులే ఈ విధంగా చేసి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు. అయితే పవన్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి పోసాని అమీర్పేటలోని ఎల్లారెడ్డి గూడలో ఉన్న తన ఇంట్లో నివాసం ఉండడం లేదని, ఆయన వేరే చోటకు మారారని తెలుస్తోంది.
కాగా పోలీసులు ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను వారు పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…