Republic Movie : దేవాకట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబులు ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం రిపబ్లిక్. ఈ మూవీ అక్టోబర్ 1వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ ద్వారా ఈ మూవీకి మంచి ఆదరణ వస్తోంది. దీంతో ఈ సినిమా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక రిపబ్లిక్ మూవీకి గాను కొందరు సెలబ్రిటీలు ఇప్పటికే ప్రీమియర్ షోను చూశారు. దీంతో వారు కూడా మూవీ బాగుందని కితాబిచ్చారు. నటుడు నాని ఈ సినిమా చూసి ట్వీట్ చేశారు. రిపబ్లిక్ మూవీ చూశా. సాయి కోసం అభిమానుల ప్రార్ధనలు రిపబ్లిక్ రూపంలో ఫలిచించాయి. దేవాకట్టా చెప్పినట్లు సాయి తేజ్ ఈజ్ బ్యాక్. టీం అందరికీ కంగ్రాట్స్ అని.. నాని ట్వీట్ చేశారు.
ఇక ఈ మూవీని చూసిన సింగర్ స్మిత కూడా దీనిపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మూవీ అద్భుతంగా ఉందని, దేవా కట్టాకు రిపబ్లిక్ కొత్త ప్రస్థానం అని, సాయి తేజ్ బాగా చేశాడని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని, అందరి స్పందన కోసం ఎదురు చూస్తున్నాను.. అంటూ స్మిత పోస్ట్ చేసింది.
అయితే ఈ మూవీ ప్రీమియర్ షోను చూసిన ఇతర సెలబ్రిటీలు కూడా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు. దీంతో మూవీ కచ్చితంగా అందరికీ నచ్చుతుందని చిత్ర దర్శక నిర్మాతలు ధీమాగా ఉన్నారు. కాగా సాయి ధరమ్ తేజకు రోడ్డు ప్రమాదంలో గాయాలు కావడంతో హాస్పిటల్లో కాలర్ బోన్కు శస్త్ర చికిత్స చేశారు. దీంతో ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆయన ఓకే చెప్పడంతోనే సినిమాను విడుదల చేస్తున్నామని దర్శకుడు దేవా కట్టా తెలిపారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…