Poonam Kaur : వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. పోస్టులు పెట్టే నటి పూనమ్ కౌర్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. ఆమెకు సినిమాలు ఏమీ లేవు కానీ జనాల నోళ్లలో మాత్రం ఆమె పేరు ఎప్పటికీ నానుతూనే ఉంటోంది. సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్టులు పెడుతుంటుంది. ఎక్కువగా సామాజిక అంశాల నేపథ్యంలోనే ఆమె పోస్టులు ఉంటాయి.
ఇక తాజాగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె ఆ ట్వీట్ చేసిన కొంత సేపటికే డిలీట్ చేసింది. అయినప్పటికీ ఆ ట్వీట్ తాలూకు స్క్రీన్ షాట్ను అప్పటికే తీసి పెట్టారు. దీంతో అది వైరల్ అవుతోంది. ఇంతకీ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్కు అర్థం ఏమిటంటే..?
విడాకుల అనంతరం నిజంగా మగవారికి బాధ ఉండదా ? కేవలం ఆడవాళ్లే బాధలు పడతారా ? కొందరు ఆడవాళ్లే మగవారిని మాటలతో బాధిస్తారు. వారి వల్లే మగవారికి కఠిన పరిస్థితులు వస్తుంటాయి. ఈ సమాజమే పక్షపాతంతో వ్యవహరిస్తుందా ? అసలు ఇప్పటికీ మనం విడాకుల అంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగామా ? విడాకులపై మనకు కచ్చితమైన ఆలోచన ఉందా ? అని ఆమె ట్వీట్ చేసింది.
అయితే ఈ ట్వీట్ చేసిన కొద్ది వ్యవధిలోనే పూనమ్ ఆ పోస్ట్ను డిలీట్ చేసింది. దీంతో అసలు ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసింది ? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల టాలీవుడ్లో విడాకులు తీసుకున్న జంట సమంత, చైతూనే. ఈ క్రమంలో ఆమె చైతూను సపోర్ట్ చేస్తూ సమంతకు వ్యతిరేకంగా ఆ ట్వీట్ చేసిందని నెటిజన్లు అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…