Samantha : నాగచైతన్యతో విడాకులు ప్రకటించిన తరువాత సమంతను నెటిజన్లు ఒక రేంజ్లో ఆడుకున్నారు. తప్పతంతా ఆమెదే అన్నట్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే కొన్ని యూట్యూబ్ చానల్స్ మాత్రం ఇంకాస్త ముందుకు వెళ్లి.. ఆమె గర్భం తీయించుకుందని, సరోగసీ కోసం సిద్ధమైందని.. ఆమె వ్యవహార శైలి అక్కినేని కుటుంబానికి నచ్చలేదని.. అందువల్లే విడాకులు తీసుకుంటున్నారని.. ఆ విషయాలను తమకు వారు చెప్పినట్లుగా కన్ఫాం చేస్తూ వీడియోలను పోస్ట్ చేశారు. దీంతో సమంతకు చిర్రెత్తుకొచ్చింది.
అలా తనపై చెడు ప్రచారం చేసిన యూట్యూబ్ చానల్స్పై ఆమె కోర్టులో నష్టపరిహారం దావా వేసింది. అందులో ఆమె విజయం సాధించింది. దీంతో ఆ చానల్స్ వారు క్షమాపణలు చెప్పి ఆ వీడియోల తాలూకు లింక్లను తీసేశారు. ఆ తరువాత కోర్టు కూడా వ్యక్తిగత విషయాలకు చెందిన వివరాల పోస్టులను సోషల్ మీడియాలో పెట్టవద్దని సమంతకు సూచించింది. అది అయిపోయిన విషయం.
ఆ తరువాత సమంత ఆధ్యాత్మిక క్షేత్రాలు వెళ్లడం, ఇతర టూరిస్టు ప్లేస్లకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ఈ మధ్యలోనే పలు సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. అయితే కోర్టు కేసులు అవడం ఏమోగానీ.. సమంతపై వస్తున్న ట్రోలింగ్ కొంత వరకు ఆగిందనే చెప్పవచ్చు. ఇది ఆమె సాధించిన విజయమేనని సినీ విశ్లేషకులు అంటున్నారు.
వాస్తవానికి ఆమె ఆ విషయంపై కోర్టుకు వెళ్లకపోయినా.. కొంత కాలం ఓపిక పడితే అంతా అదే సద్దుమణుగుతుంది. ఈ విషయాన్ని పలువురు ఇండస్ట్రీ పెద్దలు ఆమెకు చెప్పారు. అయినా ఆమె వినకుండా కోర్టు కేసుల దాకా వెళ్లింది. సరే.. ఏదైతేనేం.. కొన్ని రోజులుగా సమంతపై వస్తున్న ట్రోలింగ్ చాలా వరకు తగ్గింది. ఆమెను విమర్శించడం లేదు. యూట్యూబ్ చానల్స్ కూడా గమ్మున ఉన్నాయి. బహుశా ఇంకా ఏమైనా వీడియోలు పెడితే మళ్లీ కేసుల దాకా వెళ్లాల్సి వస్తుంది.. ఎందుకు రా బాబూ.. అనుకున్నారేమో.. దీంతో కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో సమంత పేరు పెద్దగా వినబడడం లేదు.
కారణాలు ఏమున్నా సమంతపై వస్తున్న ట్రోలింగ్, విమర్శలు చాలా వరకు తగ్గాయనే చెప్పవచ్చు. దీంతో ఆమె కాస్తంత ఊపిరి పీల్చుకోనుంది. అయితే ఫ్యాన్స్ ఏ విషయాన్ని అంత త్వరగా మరిచిపోరు. గుర్తుకు వచ్చినప్పుడు మళ్లీ ట్రోలింగ్ మొదలు పెడతారు. మరి సమంత అన్నింటికీ సిద్ధంగా ఉండాల్సిందే.. ఏం చేస్తుందో చూడాలి..!
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…