Samantha : నాగచైతన్యతో విడాకులు ప్రకటించిన తరువాత సమంతను నెటిజన్లు ఒక రేంజ్లో ఆడుకున్నారు. తప్పతంతా ఆమెదే అన్నట్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే కొన్ని యూట్యూబ్ చానల్స్ మాత్రం ఇంకాస్త ముందుకు వెళ్లి.. ఆమె గర్భం తీయించుకుందని, సరోగసీ కోసం సిద్ధమైందని.. ఆమె వ్యవహార శైలి అక్కినేని కుటుంబానికి నచ్చలేదని.. అందువల్లే విడాకులు తీసుకుంటున్నారని.. ఆ విషయాలను తమకు వారు చెప్పినట్లుగా కన్ఫాం చేస్తూ వీడియోలను పోస్ట్ చేశారు. దీంతో సమంతకు చిర్రెత్తుకొచ్చింది.
అలా తనపై చెడు ప్రచారం చేసిన యూట్యూబ్ చానల్స్పై ఆమె కోర్టులో నష్టపరిహారం దావా వేసింది. అందులో ఆమె విజయం సాధించింది. దీంతో ఆ చానల్స్ వారు క్షమాపణలు చెప్పి ఆ వీడియోల తాలూకు లింక్లను తీసేశారు. ఆ తరువాత కోర్టు కూడా వ్యక్తిగత విషయాలకు చెందిన వివరాల పోస్టులను సోషల్ మీడియాలో పెట్టవద్దని సమంతకు సూచించింది. అది అయిపోయిన విషయం.
ఆ తరువాత సమంత ఆధ్యాత్మిక క్షేత్రాలు వెళ్లడం, ఇతర టూరిస్టు ప్లేస్లకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ఈ మధ్యలోనే పలు సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. అయితే కోర్టు కేసులు అవడం ఏమోగానీ.. సమంతపై వస్తున్న ట్రోలింగ్ కొంత వరకు ఆగిందనే చెప్పవచ్చు. ఇది ఆమె సాధించిన విజయమేనని సినీ విశ్లేషకులు అంటున్నారు.
వాస్తవానికి ఆమె ఆ విషయంపై కోర్టుకు వెళ్లకపోయినా.. కొంత కాలం ఓపిక పడితే అంతా అదే సద్దుమణుగుతుంది. ఈ విషయాన్ని పలువురు ఇండస్ట్రీ పెద్దలు ఆమెకు చెప్పారు. అయినా ఆమె వినకుండా కోర్టు కేసుల దాకా వెళ్లింది. సరే.. ఏదైతేనేం.. కొన్ని రోజులుగా సమంతపై వస్తున్న ట్రోలింగ్ చాలా వరకు తగ్గింది. ఆమెను విమర్శించడం లేదు. యూట్యూబ్ చానల్స్ కూడా గమ్మున ఉన్నాయి. బహుశా ఇంకా ఏమైనా వీడియోలు పెడితే మళ్లీ కేసుల దాకా వెళ్లాల్సి వస్తుంది.. ఎందుకు రా బాబూ.. అనుకున్నారేమో.. దీంతో కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో సమంత పేరు పెద్దగా వినబడడం లేదు.
కారణాలు ఏమున్నా సమంతపై వస్తున్న ట్రోలింగ్, విమర్శలు చాలా వరకు తగ్గాయనే చెప్పవచ్చు. దీంతో ఆమె కాస్తంత ఊపిరి పీల్చుకోనుంది. అయితే ఫ్యాన్స్ ఏ విషయాన్ని అంత త్వరగా మరిచిపోరు. గుర్తుకు వచ్చినప్పుడు మళ్లీ ట్రోలింగ్ మొదలు పెడతారు. మరి సమంత అన్నింటికీ సిద్ధంగా ఉండాల్సిందే.. ఏం చేస్తుందో చూడాలి..!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…