Poonam Kaur : ఎలాంటి విషయాల్లోనైనా తన అభిప్రాయాన్ని ఏమాత్రం భయపడకుండా చెప్పే నటి పూనమ్ కౌర్. ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండే పూనమ్ కు దేవుడు అంటే ఎంతో భక్తి కూడా ఉంది. తాజాగా అబార్షన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందిస్తూ కొన్ని షాకింగ్ కామెంట్లు చేసింది. గురువారం రోజు 14 నుంచి 20 వారాల లోపు ఉన్న ప్రెగ్నెంట్ యువతులకు అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని, ఒకవేళ పెళ్లి అయినా కాకపోయినా ఒక స్త్రీకి అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
అయితే ఈ తీర్పుపై పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఆమె తీర్పుకు మద్దతు ఇస్తూనే కొందరు ఆడవాళ్ళ తీరును తప్పుబట్టింది. గర్భం దాల్చిన ప్రతి మహిళకు బిడ్డను కనాలా, లేదా ? అని నిర్ణయించుకునే హక్కు ఉంది. చాలా మంది ఆడవాళ్లు గర్భం దాల్చడం సామాజిక, ఆర్థిక భద్రతగా భావిస్తున్నారు. బయట ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్న మగాళ్లను రిలేషన్ కి కట్టుబడి ఉండేలా చేయడానికి గర్భాన్ని వాడుతున్నారు. ఆడవాళ్లు పునరుత్పత్తి సామర్థ్యాన్ని తమ స్వార్థ ప్రయోజాలకు ఉపయోగించకూడదు, మతపరమైన సంస్థలు అబార్షన్ ని తప్పుడు చర్యలకు వాడుతున్నారని అన్నది.
పూనమ్ కౌర్ చేసిన ఈ వాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఆమె ఎవరినో ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. దీనిపై మహిళా సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఇక తరచుగా పూనమ్ కౌర్ సోషల్ మీడియా పోస్ట్స్ వివాదాస్పదం అవుతూ ఉంటాయి. ఆమె పరోక్షంగా ఎవరినో టార్గెట్ చేస్తున్నట్లు పోస్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా హీరో పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా సెటైరికల్ పోస్ట్స్ వేస్తూ ఉంటుంది. పూనమ్ చర్యలు నచ్చని పవన్ ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడుతూ ఉంటారు. గత కొన్నాళ్లుగా ఈమె సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…