Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ మధ్య ఓ కార్యక్రమంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని అందరూ అంటున్నారని.. అయితే విడాకులు ఇచ్చాకే పెళ్లి చేసుకున్నానని.. తన మొదటి, రెండో భార్యలకు ఆస్తులను, డబ్బును ఇచ్చానని పవన్ చెప్పుకొచ్చారు. దీంతో ఈ టాపిక్ మళ్లీ తెర మీదకు వచ్చింది. అయితే పవన్ మూడో భార్య అయిన అన్నా లెజినీవా ఆస్తుల వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పవర్ స్టార్ వపన్ కల్యాణ్ రష్యా దేశస్థురాలు అన్నా లెజినీవాను ప్రేమవివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
తీన్మార్ సినిమాలో అన్నా లెజినీవా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ కల్యాణ్ ఆమెతో ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలోనే రేణూ దేశాయ్ తో విడాకులు తీసుకున్నారు. అనంతరం అన్నా లెజినీవాను వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉండగా లెజినీవా ప్రముఖ రష్యన్ మోడల్, నటి కాగా అనేక తెలుగు సినిమాలలో కూడా నటించారు.
అన్నా లెజినీవా1980 సంవత్సరం ఆగస్టు 3న జన్మించారు. ఇక ఎకనామిక్ టైమ్స్ ప్రకారం అన్నా లెజినీవా ఆస్తుల విలువ రూ.1800 కోట్లుగా ఉంది. అంతే కాకుండా అన్నా లెజినీవా క్రిస్టియన్ మతానికి చెందినవారు. మొదటిసారిగా పవన్ కల్యాణ్ అన్నా లెజినీవాలకు 2011లో పరిచయం ఏర్పడింది. తీన్మార్ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడగా ఒకరితో మరొకరు ప్రేమలో పడ్డారు. తరువాత మూడేళ్ల పాటు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 2013లో వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు పేరు పొలేనా, కుమారుడు మార్క్ శంకర్ లు ఉన్నారు. ఇక గతంలో అన్నా లెజినీవా మోడల్, నటి అయినప్పటికీ ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
అధికారికంగా ఆమెకు అసలు సోషల్ మీడియా ఖాతాలు కూడా లేకపోవడం విశేషం. మరోవైపు అన్నా లెజినీవా ప్రస్తుతం ఎక్కువగా రష్యాలో ఉంటున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా అన్నా లెజినీవా పిల్లలు ఇద్దరినీ సింగపూర్ లో చదివించాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. అయితే దీనిపై సమాచారం లేదు.
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…