Pawan Kalyan : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా వేడుకలో మాట్లాడిన మాటలు అటు రాజకీయంగా, ఇటు సినీ పరిశ్రమలోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిస్థితుల కారణంగా పవన్ తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక థియేటర్లలో సందడి చేయవేమో అన్న అనుమానం రాక మానదు. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో పవన్ కళ్యాణ్ సినిమాలు థియేటర్లలో విడుదల అయితే నిర్మాతలు నష్టపోవాల్సి వస్తుందని భావిస్తున్నారు.
ఇలాంటి ఉత్కంఠత పరిస్థితుల నడుమ పవన్ కళ్యాణ్ తన నిర్మాతలను పిలిచి వారికి కొన్ని సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన సినిమాలకు ఏపీలో వ్యతిరేకత ఉందంటూ ఆరోపించిన పవన్ కళ్యాణ్.. తాను నటించబోయే సినిమాలకు కూడా ఈ విధమైనటువంటి వ్యతిరేకత ఉంటుంది కనుక తాను నటించే సినిమాలు థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో మంచి ఆఫర్ వస్తే అక్కడ కూడా విడుదల చేసుకోవచ్చని పవన్ నిర్మాతలకు తెలియజేసినట్లు సమాచారం.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా నాలుగైదు సినిమాలు లైన్ లో పెట్టారని.. ఈ సినిమాలన్నీ సుమారు రూ.500 కోట్లకు పైగానే బిజినెస్ చేస్తాయని చెప్పవచ్చు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, వైసీపీ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో థియేటర్లలో తన సినిమాలను విడుదల చేసినా కలెక్షన్లపై పూర్తి ప్రభావం ఉంటుంది కనుక పవన్ కళ్యాణ్ తన సినిమాలను ఓటీటీలో విడుదల చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. పవన్ చెప్పినట్టు తన సినిమాలన్నీ థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదలైతే అభిమానులకి ఇది ఒక పెద్ద షాకింగ్ విషయం అని చెప్పవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…