Pawan Kalyan : ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హిరో చేసి హిట్ కొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొందరు హీరోలు కథ నచ్చకనో, ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్లనో మిస్ చేసుకున్న సినిమా కథలు మరో హీరో వద్దకు వెళ్లడం, సినిమా బాగుండి సూపర్ హిట్ అవ్వడం సాధారణమే. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఒకటైన బద్రి సినిమాకు కూడా మొదటి ఆప్షన్ పవన్ కళ్యాణ్ కాదట. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టో అందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో అమిషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో టైటిల్ రోల్ లో ఉన్న బద్రి క్యారెక్టర్ ని పవన్ కళ్యాణ్ తప్ప మరొకరు చేయలేరేమో అనే రేంజ్ లో యాక్ట్ చేసాడు పవన్. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ సీన్లు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. బద్రి సినిమాను విజయలక్ష్మి మూవీస్ బ్యానర్ పై టీ. త్రివిక్రమరావు నిర్మించగా 2000 సంవత్సరంలో ఏప్రిల్ 20న ఈ చిత్రం విడుదలైంది. అయితే ఈ సినిమాకు ముందుగా పూరీ జగన్నాథ్ నాగార్జునను అనుకున్నారట. పూరీ ఆర్జీవీ వద్ద శిష్యరికం చేసిన సంగతి తెలిసిందే.
ఆర్జీవీ నాగార్జున మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడంతో పూరీ నాగార్జునను ఊహించుకుని కథను రాసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున వద్దకు వెళ్లి కథ వినిపించారు. కానీ అప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాగ్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దాంతో పూరీ వరుస హిట్లతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ కు ఈ కథను వినిపించారు. పవన్ కూడా కథలో కొన్ని మార్పులు చేయాలని కోరారు. పూరీ క్లైమాక్స్ మాత్రం మార్చనని తెగేసి చెప్పారట. అయినప్పటికీ పవన్ ఓకే చెప్పారు. అలా బద్రి సినిమాకు నాగ్ నో చెప్పడంతో పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…