Pawan Kalyan : సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ల వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. వీరిద్దరూ మైసూర్లోని ఓ హోటల్లో ఉండగా.. అక్కడికి నరేష్ భార్య రమ్య రఘుపతి చేరుకుని వీరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తరువాత రమ్య పవిత్రను చెప్పుతో కొట్టబోగా పోలీసులు అడ్డుకున్నారు. తరువాత అందరినీ అక్కడి నుంచి పంపించివేశారు. అయితే ఈ ముగ్గురూ వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే నరేష్ తన భార్య రమ్యకు ఇంకో అఫెయిర్ అంట గట్టారు. అలాగే రమ్య మాట్లాడుతూ నరేష్కు, పవిత్రకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని.. తాను న్యాయం పోరాటం చేస్తానని తెలిపారు.
ఇక పవిత్ర లోకేష్ మాట్లాడుతూ.. తాను నరేష్ కలిసే ఉంటున్నామని.. తమకు సపోర్ట్ అందించాలని కోరారు. అలాగే తన పేరిట వస్తున్న తప్పుడు వార్తలతోపాటు తన పేరిట ఓపెన్ అయి ఉన్న ఫేక్ అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇక ప్రస్తుతం కథ ఇక్కడి వరకు రాగా.. వీరి వ్యవహారంలోకి తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ను లాగారు. అందుకు కూడా ఒక కారణం ఉంది. పవన్ ఈమధ్యే నాని మూవీ అంటే సుందరానికీ.. ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. అక్కడ నరేష్ను ఆయన పొగడ్తల్లో ముంచెత్తారు.
నరేష్ గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషని, చెన్నైలో పక్క పక్కనే ఉండేవాళ్లమని పవన్ తెలిపారు. నరేష్ ఎంతో హుందాగా ఉంటారంటూ ఆయనను పవన్ ఆకాశానికెత్తేశారు. అయితే నరేష్ వ్యవహారం మొత్తం బట్టబయలు కావడంతో ఆయనను చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అలాగే అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ ఆయన గురించి మాట్లాడిన మాటల తాలూకు వీడియోను బయటకు తీసి.. పవన్, నరేష్ ఇద్దరూ దొందూ దొందే.. ఒకరికి ఒకరు సరిపోయారని అంటున్నారు. ఇద్దరూ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని.. ఇద్దరి కథ సేమ్ అని.. అలాంటిది నరేష్ను పవన్ పొగడడం హాస్యాస్పదంగా ఉందని ట్రోల్ చేస్తున్నారు. అయితే పవన్ అనవసరంగా ఈ వివాదంలో ట్రోలింగ్కు గురవుతుండడంతో ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక నరేష్, పవిత్ర లోకేష్, రమ్యల కథకు ఎప్పుడు శుభం కార్డు పడుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…