Mahabaleshwaram : ఈ మధ్య కాలంలో మనకు వార్తల్లో తరచూ వినిపిస్తున్న ఆలయం పేరు ఒకటి ఉంది. అదే మహాబలేశ్వరం ఆలయం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని గోకర్ణంలో ఉంది. అయితే సెలబ్రిటీ జంటలు చాలా మంది ఈ మధ్య కాలంలో తరచూ ఈ ఆలయానికి వెళ్తున్నారు. మొన్నటికి మొన్న నరేష్, పవిత్ర లోకేష్లు ఈ ఆలయాన్ని దర్శించుకోగా.. గతంలో నయన తార, విగ్నేష్లు ఈ ఆలయాన్ని దర్శించుకుని ఇక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అయితే సెలబ్రిటీ జంటలు ఈ ఆలయాన్ని తరచూ ఎందుకు దర్శించుకుంటున్నారు ? అంతగా దీని ప్రత్యేకత ఏముంది ? అన్న వివరాల్లోకి వెళితే..
మహాబలేశ్వరం ఆలయాన్ని గోకర్ణ క్షేత్రం అని కూడా అంటారు. ఇది గోవాకు అతి సమీపంలో ఉంటుంది. కనుక ఈ ఆలయం పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంటుంది. ఇక్కడ ఉన్నది శివుడు. ఆత్మలింగం రూపంలో ఉంటాడు. అప్పట్లో రావణాసురుడు తనకు ఇచ్చిన ఆత్మ లింగాన్ని ఇక్కడే విడిచిపెట్టాడని స్థల పురాణం చెబుతోంది. అలాగే మారు వేషంలో వచ్చి లింగాన్ని కింద పెట్టిన వినాయకుడి ఆలయం కూడా ఈ క్షేత్రంలోనే ఉంది. కనుక ఇందులో శివుడితోపాటు వినాయకున్ని కూడా దర్శించుకుంటారు. అయితే ఇక్కడ కుజ దోష పూజలు కూడా చేస్తారు.
మహాబలేశ్వరం ఆలయంలో కుజ దోష పూజలు చేస్తారు. పెళ్లి కాని వారు, అయిన వారు కూడా ఈ పూజలు చేసుకోవచ్చు. దీంతో ఈ దోషం పరిహారం అవుతుందని నమ్ముతారు. కనుకనే సెలబ్రిటీలు చాలా మంది ఈ ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. గతంలో నయనతార, విగ్నేష్లు కూడా ఇక్కడ దోష నివారణ పూజలు చేశారు. ఇటీవల నరేష్, పవిత్ర లోకేష్లు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. సెలబ్రిటీలు చాలా మంది ఈ ఆలయాన్ని బాగా నమ్ముతారు. కనుకనే సహజంగానే వారి తాకిడి ఈ ఆలయానికి ఎక్కువగా ఉంటుంది.
ఇక మహాబలేశ్వరం చేరుకోవాలంటే విమానమార్గంలో అయితే గోవా బెటర్. రైలు మార్గం అయితే గోకర్ణంకు 23 కిలోమీటర్ల దూరంలో కుంట, 25 కిలోమీటర్ల దూరంలో అంకోలా స్టేషన్లు ఉన్నాయి. వీటికి వచ్చి గోకర్ణంకు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. రోడ్డు మార్గం అయితే నేరుగానే వెళ్లవచ్చు. ఆలయాన్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు దర్శనం కోసం తెరిచి ఉంచుతారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…