Anasuya : తెలుగు బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఓ వైపు బుల్లితెరపై టీవీ షోలలో అదరగొడుతూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది. ఈ మధ్య కాలంలో అనసూయ నటించిన అనేక చిత్రాలు వరుసగా విడుదలయ్యాయి. అప్పట్లో ఈమె నటించిన రంగస్థలం చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అందులో రంగమ్మత్తగా ఈమె యాక్టింగ్ అద్భుతంగా చేసింది. అలాగే మొన్నీ మధ్య వచ్చిన పుష్పలో దాక్షాయణి పాత్రలో నెగెటివ్ రోల్లో కనిపించి అదరగొట్టేసింది. ఇలా అనసూయ బుల్లితెరతోపాటు వెండితెరపై కూడా దూసుకుపోతోంది.
అయితే అనసూయపై ఓ కార్యక్రమంలో భాగంగా అదిరే అభి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా అభి మాట్లాడుతూ.. అను, నిన్ను కెరీర్ బిగినింగ్ నుంచి చూస్తున్నా. న్యూస్ రీడర్గా చేశావు, యాంకర్గా చేశావు, ఇప్పుడు నటి అయ్యావు. పెద్ద పెద్ద స్టార్స్ సినిమాల్లో నటిస్తున్నావు. నీ ఎదుగులకు నువ్వే కారణం. నీకు ఎవరూ భిక్షపెట్టలేదు. నువ్వు కష్టపడి పైకి వచ్చావు. పుష్ప హిట్ అయ్యాక నీకు హిందీలోనూ పేరు వచ్చింది. ఇక తగ్గేదేలే. నువ్వు ఇంకా మంచి సినిమాలు చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి.. అంటూ అభి అనసూయను పొగడ్తల్లో ముంచెత్తాడు.
కాగా తనపై అభి చేసిన కామెంట్స్కు అనసూయ మురిసిపోయింది. ఆమె సంతోషంగా అభికి థాంక్స్ చెబుతూ లవ్ ఎమోజీలతో కూడిన పోస్ట్ను పెట్టింది. అయితే అనసూయ రీసెంట్గా జబర్దస్త్కు గుడ్ బై చెప్పేసింది. తన కెరీర్లో తాను ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నానని.. ఇకపై కూడా ప్రేక్షకులు తనకు మద్దతుగా ఉంటారని కోరుకుంటున్నానని.. అనసూయ పోస్ట్ పెట్టింది. అయితే ఆమె జబర్దస్త్ను వీడేందుకు కారణం సినిమాలే అని తెలుస్తోంది. సినిమాల్లో చాన్స్లు బాగా వస్తున్నందునే టీవీ షోలకు గుడ్ బై చెబుతుందని సమాచారం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…