Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఎంతో బిజీగా ఉన్న విషయం విదితమే. అయితే ఆయన తన కుటుంబానికి మాత్రం తగినంత సమయాన్ని ఎల్లప్పుడూ కేటాయిస్తుంటారు. ఇక తాజాగా ఆయన తన మాజీ భార్య రేణు దేశాయ్, కొడుకు అకీరా నందన్, కుమార్తె ఆద్యలతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా ఈ ఫొటోను చూసిన పవన్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుమారుడి కోసం పవన్, రేణులు ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారా.. వారు కలసి పోయారా.. అని ఆరాలు తీస్తున్నారు. అయితే పవన్ ప్రస్తుతం తన భార్య అన్నా లెజినోవాతో కలసి ఉంటున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే రేణుకు విడాకులు ఇచ్చేశారు కనుక ఆమెతో ఉండడం కుదరదు. కానీ పిల్లల కోసం వీరు ఇలా అప్పుడప్పుడు కలుస్తుంటారు. దీంతో తాజాగా కూడా మరోమారు వీరు ఇలా కలిశారు. చూస్తుంటే అకీరా నందన్కు చెందిన ఏదైనా ప్రోగ్రామ్లో వీరిద్దరూ పాల్గొని ఉంటారని తెలుస్తోంది.
ఇక అకీరా నందన్ విషయానికి వస్తే.. అతని ఎత్తు ప్రస్తుతం 6 అడుగుల 2 అంగుళాలు. తండ్రి కన్నా ఎత్తు ఎక్కువ ఉండడమే కాదు.. ఆయన అడుగు జాడల్లోనూ అకీరా నడుస్తున్నాడు. మొన్నీ మధ్యే తన బర్త్ డే సందర్భంగా రక్తదానం చేశాడు. ఇక అకీరా మార్షల్ ఆర్ట్స్, సంగీతంలోనూ దిట్టే. ఇటీవలే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలోని కళావతి అనే సాంగ్ను అకీరా పియానోపై వాయించి అబ్బురపరిచాడు. దీంతో అకీరా టాలెంట్కు అందరూ ఫిదా అయ్యారు. అయితే చాలా రోజుల తరువాత పవన్, రేణు ఇద్దరూ ఇలా ఒకే వేదికపై కనిపించడంతో.. పవన్ ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలోనే వీరి ఫొటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…