సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ ల వ్యవహారం ఎంతటి చర్చనీయాంశంగా మారిందో అందరికీ తెలిసిందే. వీరు ఒక హోటల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడంతో వీరిపై ఉన్న గౌరవం కాస్తా పోయింది. అయితే అనూహ్యంగా వీరు హైలైట్ అయ్యారు. ఈ మధ్యే విడుదలైన పలు సినిమాల్లో వీరు కనిపించేసరికి ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ చప్పట్లు కొట్టారు. అయితే పరువు పోయి అవకాశాలు తగ్గుతాయనుకున్న పవిత్రకు ఇంతటి రెస్పాన్స్ వచ్చేసరికి ఆమె తన పారితోషికాన్ని పెంచిందని తెలుస్తోంది. దీంతో నిర్మాతలు హైరానా పడుతున్నారట.
అసలే కరోనా కారణంగా టాలీవుడ్కు తీవ్రమైన దెబ్బ పడింది. దీనికి తోడు గోటి చుట్టుపై రోకలిపోటులా మరోవైపు ఓటీటీల కారణంగా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో సినిమా పాజిటివ్ టాక్ను దక్కించుకున్నా రెండో రోజు నుంచే కలెక్షన్లు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో నిర్మాతలు అందరూ షూటింగ్లను నిలిపివేసి సమస్యలు పరిష్కరించుకోవాలని చర్చిస్తున్నారు. అయితే ఖర్చులు తగ్గించుకోవడం అన్నది కూడా వారి సమస్యల్లో ఉంది. అందులో భాగంగానే నటీనటుల రెమ్యునరేషన్ ను తగ్గించాలని వారు చూస్తున్నారు. ఇప్పటికే హీరోలతో ఈ విషయం చర్చించి ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈమధ్య తనకు లభించిన ఆదరణ కారణంగా పవిత్రా లోకేష్ తన రెమ్యునరేషన్ను పెంచిందట. మొన్నటి వరకు రోజుకు రూ.60వేలు తీసుకున్న ఆమె ఇప్పుడు ఏకంగా రూ.1 లక్ష వరకు డిమాండ్ చేస్తున్నదట. దీంతో అసలే నష్టాల్లో ఉండి నటీనటుల రెమ్యునరేషన్ను తగ్గించాలని చూస్తుంటే.. ఇప్పుడు పవిత్రా లోకేష్ ఇలా రెమ్యునరేషన్ను పెంచడం ఏమీ బాగాలేదని అంటున్నారట. ఈ క్రమంలోనే టాలీవుడ్లో ఈమె వ్యవహారం మరోమారు చర్చనీయాంశం అయినట్లు తెలుస్తోంది. అయితే ఒక్క నటి కోసం నిర్మాతలు ఏమీ ఆలోచించరు. అందరికీ సౌకర్యంగా ఉండేలా చేస్తారు. కనుక ఆమెను పెద్దగా పట్టించుకోకపోవచ్చని తెలుస్తోంది. ఇక టాలీవుడ్ సమస్యలకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…