సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ ల వ్యవహారం ఎంతటి చర్చనీయాంశంగా మారిందో అందరికీ తెలిసిందే. వీరు ఒక హోటల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడంతో వీరిపై ఉన్న గౌరవం కాస్తా పోయింది. అయితే అనూహ్యంగా వీరు హైలైట్ అయ్యారు. ఈ మధ్యే విడుదలైన పలు సినిమాల్లో వీరు కనిపించేసరికి ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ చప్పట్లు కొట్టారు. అయితే పరువు పోయి అవకాశాలు తగ్గుతాయనుకున్న పవిత్రకు ఇంతటి రెస్పాన్స్ వచ్చేసరికి ఆమె తన పారితోషికాన్ని పెంచిందని తెలుస్తోంది. దీంతో నిర్మాతలు హైరానా పడుతున్నారట.
అసలే కరోనా కారణంగా టాలీవుడ్కు తీవ్రమైన దెబ్బ పడింది. దీనికి తోడు గోటి చుట్టుపై రోకలిపోటులా మరోవైపు ఓటీటీల కారణంగా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో సినిమా పాజిటివ్ టాక్ను దక్కించుకున్నా రెండో రోజు నుంచే కలెక్షన్లు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో నిర్మాతలు అందరూ షూటింగ్లను నిలిపివేసి సమస్యలు పరిష్కరించుకోవాలని చర్చిస్తున్నారు. అయితే ఖర్చులు తగ్గించుకోవడం అన్నది కూడా వారి సమస్యల్లో ఉంది. అందులో భాగంగానే నటీనటుల రెమ్యునరేషన్ ను తగ్గించాలని వారు చూస్తున్నారు. ఇప్పటికే హీరోలతో ఈ విషయం చర్చించి ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈమధ్య తనకు లభించిన ఆదరణ కారణంగా పవిత్రా లోకేష్ తన రెమ్యునరేషన్ను పెంచిందట. మొన్నటి వరకు రోజుకు రూ.60వేలు తీసుకున్న ఆమె ఇప్పుడు ఏకంగా రూ.1 లక్ష వరకు డిమాండ్ చేస్తున్నదట. దీంతో అసలే నష్టాల్లో ఉండి నటీనటుల రెమ్యునరేషన్ను తగ్గించాలని చూస్తుంటే.. ఇప్పుడు పవిత్రా లోకేష్ ఇలా రెమ్యునరేషన్ను పెంచడం ఏమీ బాగాలేదని అంటున్నారట. ఈ క్రమంలోనే టాలీవుడ్లో ఈమె వ్యవహారం మరోమారు చర్చనీయాంశం అయినట్లు తెలుస్తోంది. అయితే ఒక్క నటి కోసం నిర్మాతలు ఏమీ ఆలోచించరు. అందరికీ సౌకర్యంగా ఉండేలా చేస్తారు. కనుక ఆమెను పెద్దగా పట్టించుకోకపోవచ్చని తెలుస్తోంది. ఇక టాలీవుడ్ సమస్యలకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…