నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంత ఒంటరి జీవితాన్నే అనుభవిస్తోంది. వాస్తవానికి ఆమెకు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ వారు చెన్నైలో స్థిర పడ్డారు. అందువల్ల సమంతతో వారు కలసి జీవించే అవకాశం లేదు. అయితే కారణాలు ఏమున్నా.. సమంత ప్రస్తుతం ఒంటరి జీవితాన్నే గడుపుతోంది. ఈ క్రమంలోనే ఆమె తీవ్రమైన డిప్రెషన్లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సాక్ష్యాన్ని కూడా కొందరు చూపుతున్నారు. ముంబై ఎయిర్పోర్టులో ఆమె చేతిలో ఉన్న పుస్తకమే.. ఆమె డిప్రెషన్తో బాధపడుతుందని చెప్పేందుకు ఉదాహరణ అని అంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
సమంత ఇటీవలే ముంబై ఎయిర్పోర్టులో దర్శనమిచ్చింది. పలు బాలీవుడ్ ప్రాజెక్టుల్లోనూ అవకాశాలు వస్తున్నందున ఆమె ముంబైకే మారిపోయింది. అక్కడి నుంచి హైదరాబాద్కు తరచూ వస్తూ ఇక్కడ షూటింగ్స్ చేస్తోంది. అయితే ముంబై ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తూ కనిపించిన సమంత చేతిలో ఓ పుస్తకం పట్టుకుని దర్శనమిచ్చింది. దాని పేరు.. యూ కెన్ హీల్ యువర్ లైఫ్. దీన్ని ప్రముఖ రచయిత లూయిస్ హే రచించారు. ఈ క్రమంలోనే ఈ పుస్తకాన్ని సమంత చేతిలో చూడడంతో ఆమె తీవ్రమైన డిప్రెషన్లో ఉందని అంటున్నారు.
ఇక ఆ బుక్లో మానసిక ప్రశాంతతను సాధించడం, మనసును శరీరానికి అనుసంధానం చేయడం, భావోద్వేగాలపై అదుపు.. వంటి విషయాల గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలోనే మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ బుక్ ఉపయోగపడుతుంది. అయితే సమంత చేతిలో ఈ పుస్తకాన్ని చూడడంతో ఆమె డిప్రెషన్ లో ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం వల్ల ఆమె లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఆమెపై రోజు రోజుకీ నెగెటివిటీ ఎక్కువైపోయింది. దీంతో ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కనుకనే ఆ పుస్తకం చదువుతుందని అంటున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.
ఇక సమంత ప్రస్తుతం బాలీవుడ్పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ముంబైలో ఓ ఖరీదైన ఇంటిని ఈమె కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈమె రెండు వరుస బాలీవుడ్ చిత్రాలకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగులో శాకుంతలం, ఖుషి, యశోద సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇవి రానున్న రోజుల్లో విడుదల కానున్నాయి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…