NTR : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇందులో కొమురం భీమ్గా ఎన్టీఆర్ యాక్టింగ్ అదరగొట్టేశాడు. అలాగే అల్లూరి పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతూ రికార్డులను కొల్లగొడుతోంది. ఇక త్వరలోనే ఈ మూవీని చైనా, జపాన్లలోనూ విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్, ఎన్టీఆర్లు తమ ప్రాజెక్టుల్లో బిజీగా మారిపోయారు.
రామ్చరణ్ నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29వ తేదీన విడుదల కానుండగా.. శంకర్ దర్శకత్వంలో చరణ్ ఇంకో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కూడా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఇందులో హీరోయిన్గా ఆలియాభట్ను కన్ఫామ్ చేశారు. కానీ ఆమెకు ప్రస్తుతం వివాహం అయినందున ఆమె కాల్ షీట్స్ అందుబాటులో లేవు. దీంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీనిపై చిత్ర యూనిట్ తాజాగా ప్రకటన చేసింది. ఆలియా నటించడం లేదని చెప్పారు. అయితే కొరటాల శివతో చేయనున్న మూవీకి గాను ఎన్టీఆర్ భారీ ఎత్తున పారితోషికం తీసుకోబోతున్నాడని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత కాగా.. ఆ మూవీకి తారక్ రూ.45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇక కొరటాల శివతో చేయనున్న సినిమాకు ఎన్టీఆర్ ఏకంగా రూ.10 కోట్లు పెంచి రూ.55 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ వల్లే ఎన్టీఆర్ తన పారితోషికాన్ని అమాంతం పెంచేశారని సమాచారం. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ను జరుపుకోనుంది. ఆలియా తప్పుకోవడంతో ఇంకో హీరోయిన్ కోసం ప్రస్తుతం చిత్ర యూనిట్ వేట కొనసాగిస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…