Bobbili Puli : రూ.50 ల‌క్ష‌లు పెట్టి తీసిన బొబ్బిలిపులి.. ఎంత వ‌సూలు చేసిందో తెలుసా..?

Bobbili Puli : విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామ‌రావు నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా నటించగలరు ఎన్టీఆర్. పౌరాణిక‌, జాన‌ప‌ద‌, సాంఘిక చిత్రాల్లో అద్భుత‌మైన పాత్ర‌ల్లో న‌టించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఘ‌న‌త మొదటిగా ఎన్టీఆర్‌కే ద‌క్కుతుంది. ఎన్టీఆర్ నట జీవితంలో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు ఉన్నాయి. ఆయన నటించిన  హిట్ చిత్రాల్లో బొబ్బిలి పులి సినిమా కూడా ఒకటి. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో సంచలనంగా నిలిచింది.

ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ సంభాష‌ణ‌లు రాస్తున్న స‌మ‌యంలో నిర్మాత వ‌డ్డే ర‌మేష్ ఈ సినిమాకు అన్ని చిత్రాల‌కంటే  క్లైమాక్స్ భిన్నంగా, చ‌రిత్ర‌లో అది మ‌రిచిపోలేని స‌న్నివేశం కావాల‌ని దాస‌రికి చెప్పార‌ట‌. అనుకున్నవిధంగానే దాస‌రి అలాగే సినిమాను తీర్చిదిద్దార‌ట‌. ఫైనల్ గా సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్స్ చాలా అద్భుతంగా వ‌చ్చాయి.

Bobbili Puli

ఇక ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్న సమయానికి అప్ప‌టికే ఎన్టీఆర్ పార్టీ స్థాపించాల‌నే ఆలోచనతో బిజీగా ఉన్నారు. ఆ స‌మ‌యంలోనే దాస‌రిని పిలిపించి ఒక మంచి సినిమా చేద్దామ‌ని చెప్పారట ఎన్టీఆర్‌. దాస‌రి బాగా ఆలోచించి ఒక సైనికుడు సెల‌వుల‌కు ఇంటికి వ‌స్తాడని.. అక్క‌డి వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తాడు. అక్క‌డి ప‌రిస్థితుల‌ను చూసి నేను ఉండాల్సింది సైన్యంలో కాదు. ఇక్క‌డే ఉండి సమాజంలో జరుగుతున్న అన్యాయంపై తిర‌గ‌బ‌డ‌తాడు అని క‌థ చెప్పాడు. క‌థ‌ చాలా బాగుంది బ్ర‌ద‌ర్ ప్రొసీడ్ అని ఎన్టీఆర్ దాస‌రితో చెప్పారట‌.

ఇలాంటి క‌థ‌లో ఆడ‌వారికి కూడా న‌చ్చే పాయింట్లు ఉండాలి. ప్రియుని బాగు కోసం త‌న ప్రేమ‌ను త్యాగం చేసే ప్రియురాలు, భ‌ర్త బ‌తికే ఉన్నా చ‌నిపోయాడ‌నుకొని బొట్టు తీసేసిన భార్య, భార్య చనిపోయిందని తెలుసుకున్న భర్త పోలీసులు కాపు కాసి ఉన్నా కూడా కాటికాప‌రి వేషంలో వ‌చ్చి త‌ల‌కొరివి పెడ‌తారు.. ఇక చాలు అనుకున్నారు దాస‌రి నారాయ‌ణ‌రావు. ఇక చిత్రం మొత్తానికి క్లైమాక్స్ లో జరిగే సంభాషణ హైలైట్ గా నిలుస్తుంది.

రూ.50 లక్షల బడ్జెట్ తో 50 రోజులలో నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ దగ్గరికి వెళ్ళింది. సెన్సార్ బోర్డు చైర్మ‌న్ యల్.వి.ప్ర‌సాద్‌, ఎదురుగా ద‌ర్శ‌కుడు దాస‌రినారాయ‌ణ‌రావు, నిర్మాత వడ్డే రమేష్ కూర్చుని సినిమా చూశారు. దానికి ముందే మ‌ద్రాస్ రీజ‌న‌ల్ క‌మిటీ బొబ్బిలి పులి సినిమాను చూసింది. 3వేల అడుగుల క‌ట్స్ చెప్పింది. 3వేల అడుగుల‌ క‌ట్స్ అంటే ఇక సినిమాలో ఏమీ మిగ‌ల‌దు. ఎన్టీఆర్ చెప్పే డైలాగ్‌లు కూడా మిగ‌ల‌వు. సెంట్ర‌ల్ గవర్నమెంట్ లో ఇందిరాగాంధీ ప్ర‌భుత్వం పాలనలో ఉంది. ఈ డైలాగ్‌లు అన్నీ ఆమె పాల‌న‌కు చిచ్చుపెట్టేలా ఉన్నాయి. ఇందులో డైలాగ్స్ ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా ఉన్నాయి.

ఇవ‌న్నీ తీసేయాల‌ని మ‌ద్రాస్ రీజ‌న‌ల్ క‌మిటీ దర్శక నిర్మాతలకు సూచించింది. అసలు విషయం తేల్చుకుందామ‌ని ద‌ర్శ‌కుడు దాస‌రి, నిర్మాత వ‌డ్డే ర‌మేష్‌ రివైజింగ్ క‌మిటీ వ‌ద్ద‌కు వ‌చ్చారు. సెన్సార్ బోర్డు చైర్మ‌న్ యల్.వి.ప్ర‌సాద్ సినిమా చూసి వాళ్ల‌ను పిలిచారు. ఓన్లీ సింగిల్ క‌ట్ ఇస్తున్నాను, క్లైమాక్స్ మొత్తం తీసేయండి అని చెప్పారు. దీంతో దాస‌రి మేము ఢిల్లీలో తేల్చుకుంటామ‌ని తెలియజేశారు.

తొలుత తెలుగు, త‌మిళ ఐఏఎస్‌ల‌ను 18 మంది పోగు చేసుకొని వారందరికీ సినిమా చూపించారు. సినిమా చాలా బాగుంది. ఇలాంటి అద్భుతమైన సినిమాకి క‌ట్స్ ఎందుకు అని అన్నారు అంద‌రూ. ఆ త‌రువాత పీవీ న‌ర‌సింహారావు, పి.వెంక‌ట సుబ్బయ్య‌, జ‌న‌ర‌ల్ కృష్ణారావు, అప్ప‌టి డిప్యూటీ సీఎం జ‌గ‌న్నాథ‌రావు.. వీరంద‌రినీ జ‌త చేసి మ‌ళ్లీ షో వేశాడు నిర్మాత రమేష్. మీకెందుకు మేము చూసుకుంటామ‌ని నిర్మాత ర‌మేష్‌కి అందరూ హామీ ఇచ్చారు. ర‌మేష్‌, ప్ర‌భాక‌ర్‌రెడ్డిలు క‌లిసి మ‌ద్రాస్‌లో ఉన్న దాస‌రికి ఫోన్‌చేశారు. మీరు వెంట‌నే రండి.. ఇంకొక్క‌రికి చూపిస్తే మ‌న సినిమా విడుద‌ల‌వుతుంది. ఆయ‌న ఎవ్వ‌రో కాదు మ‌న తెలుగువాడు నీలం సంజీవ‌రెడ్డి. ఆయ‌న ఆ సమయంలో భార‌త రాష్ట్రప‌తిగా ఉన్నారు.

నీలం సంజీవ‌రెడ్డికి ప్ర‌త్యేకంగా రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో బొబ్బిలి పులి చిత్రాన్ని చూపించారు. ఇక సెన్సార్ అధికారులు కటింగ్స్ లేకుండా జులై 9, 1982న సినిమా విడుద‌లైంది. అనేక చోట్ల చిత్రం రిలీజ్ అయ్యి 175 రోజుల‌ వరకు ఆడింది. బొబ్బిలిపులి ఎన్టీఆర్ ని హీరో నుంచి నాయ‌కుడిగా ఆయన రేంజ్ ని పెంచేసింది. ఈ సినిమా అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో మొదటిసారిగా వందకు పైగా థియేటర్లలో విడుదలైన చిత్రంగా రికార్డుల‌ను క్రియేట్ చేసింది.

విడుదలైన తొలిరోజే రూ.13 ల‌క్ష‌లు వ‌సూలు రాబట్టుకుంది. అదేవిధంగా తొలి వారంలో రూ.78 ల‌క్ష‌ల‌కు పైగా కలెక్షన్లను వసూలు చేసింది.  రెండు వారాల్లో కోటికి పైగా వ‌సూలు చేసింది. మొత్తంగా రూ.3 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసిన బొబ్బిలి పులి 39 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ చిత్రం హైద‌రాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ సుద‌ర్శ‌న్ 35 ఎంఎంలో 175 రోజులు రన్ అయ్యి రికార్డులు సృష్టించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్! స్కాట్లాండ్‌కు బంపర్ ఆఫర్..

భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…

Saturday, 24 January 2026, 5:25 PM

BSSC ఇంటర్ లెవల్ నోటిఫికేషన్ 2026: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…

Saturday, 24 January 2026, 10:15 AM

రాయ్‌పూర్ టీ20: కివీస్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం!

రాయ్‌పూర్ వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని…

Friday, 23 January 2026, 10:53 PM

పప్పులను వండే ముందు నానబెడుతున్నారా? లేదంటే డేంజరే.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న షాకింగ్ నిజాలు!

భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…

Friday, 23 January 2026, 8:02 PM

విశ్లేషణ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంకృతాపరాధం.. పాక్ మాటలు నమ్మి వరల్డ్ కప్‌కు దూరం?

ఎదుటి వ్య‌క్తి క‌ష్టాల్లో ఉంటే అత‌ని ప‌రిస్థితిని కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆస‌రాగా చేసుకుని త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలు…

Friday, 23 January 2026, 3:54 PM

మీ పాన్ కార్డు పోయిందా? స్మార్ట్‌ఫోన్‌లోనే ‘ఇ-పాన్’ డౌన్‌లోడ్ చేసుకోండి.. పూర్తి ప్రాసెస్ ఇదే!

ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…

Friday, 23 January 2026, 9:51 AM

అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…

Thursday, 22 January 2026, 4:46 PM

కేవలం రూ.9,699కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్లౌపంక్ట్ నుంచి అదిరిపోయే లాంచ్!

బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…

Thursday, 22 January 2026, 1:51 PM