Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుష్ కోసం ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆది పురుష్ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. అని ఉత్కంఠగా ఉన్నారు. ప్రభాస్ బాహుబలి తరువాత నటించిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో మంచి హిట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ నటించిన ఆది పురుష్ తరువాత చిత్రంగా విడుదల కానుంది. దీంతో అన్ని ఆశలూ ఈ చిత్రంపైనే పెట్టుకున్నారు.
ఇక ఆది పురుష్ చిత్రం నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ను తాజాగా రిలీజ్ చేశారు. రాముడిగా ప్రభాస్ లుక్ను చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ప్రీ లుక్ పోస్టరే ఇలా ఉంటే.. రేపు సినిమా ఎలా ఉంటుందోనని.. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పోస్టర్లో ప్రస్తుతం కొందరు తప్పులు వెతికే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే పోస్టర్లో ప్రభాస్ రాముడి పాత్రలో చెప్పులు ధరించి ఉండడాన్ని వారు ట్రోల్ చేస్తున్నారు. రాముడు ఎంత స్టైలిష్ చెప్పులను ధరించాడో కదా.. అంటూ హేళన చేస్తున్నారు.
అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆయనపై వస్తున్న ట్రోల్స్ను తిప్పికొడుతున్నారు. ఆ కాలంలో పాదుకలు ధరించేవారని.. రామాయణం, భారతం తెలిసిన వారికి ఈ విషయం అర్థమవుతుంది.. అనవసరంగా ప్రభాస్ చెప్పులపై కామెంట్స్ చేయవద్దని అంటున్నారు. అయితే వాస్తవానికి త్రేతాయుగంలో ఆ తరువాత ద్వాపర యుగంలో పాదుకలను చాలా మంది ధరించేవారు. ఇందులో తప్పేమీ లేదు. ప్రభాస్ రాముడి పాత్రలో ధరించినవి కూడా అలాంటివే. కనుక ఇందులో తప్పుబట్టాల్సిన పనిలేదు. మరి పని కట్టుకుని మరీ కొందరు ఇలా ఎందుకు చేస్తున్నారు.. అనేది అర్థం కావడం లేదు. ఇక ఆదిపురుష్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. ప్రభాస్ ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…