Nostradamus : అప్పట్లో.. అంటే.. 2012 డిసెంబర్ 21న ప్రపంచం ప్రళయం వచ్చి అంతం అవుతుందని చాలా మంది చెప్పారు. మయన్ల నాగరికత ప్రకారం.. ఆ తేదీ క్యాలెండర్లో చివరి తేదీ అని.. కనుక ఆ తేదీన ప్రపంచం అంతం అవుతుందని అన్నారు. అయితే అది తప్పని తేలింది. కానీ 2022లో ప్రళయాలు చాలా ఏర్పడుతాయని.. ప్రముఖ ఫ్రెంచి జ్యోతిష్యుడు మైకేల్ డి నాస్ట్రడామస్ ఎప్పుడో చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం.. 2022లో ఏర్పడనున్న ఉత్పాతాల వివరాలు ఇలా ఉన్నాయి.
2022లో ప్రపంచ వ్యాప్తంగా అనేక సంఘటనలు జరుగుతాయని నాస్ట్రడామస్ చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం.. ఆ ఏడాదిలో ఆకాశం నుంచి భారీ సైజులో ఉండే ఉల్కలు భూమి మీద పడతాయట. సముద్రాల్లో అవి పడడం వల్ల భారీ ఎత్తున నీరు సముద్ర తీరం నుంచి బయటకు వస్తుందట. అది సునామీలా సమీపంలో ఉన్న భూభాగాన్ని ఆక్రమిస్తుందట.
అలాగే 2022లో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందట. దీంతో భారీగా ధరలు పెరుగుతాయి. అలాగే అమెరికా డాలర్ పూర్తిగా పతనం అవుతుందట. 2022లో పలు చోట్ల అణు బాంబు పేలుళ్లు జరిగే అవకాశం ఉందట. దీంతో భూమి స్వరూపమే మారిపోతుందని.. నాస్ట్రడామస్ చెప్పారు.
2022లో ప్రపంచం మొత్తం 72 గంటల పాటు కరెంటు ఉండదట. అలాగే తీవ్రమైన ప్రకృతి విపత్తులు ఏర్పడుతాయట. మంచు పెద్ద ఎత్తున కరుగుతుందట. అయితే విధ్వంసం అంతా జరిగాక ప్రశాంతత ఉంటుందని చెప్పారు. ఆ విధ్వంసం కొన్ని గంటల పాటు ఉంటుందట.
ఇక వచ్చే ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల తీవ్రమైన తుఫాన్లు ఏర్పడుతాయట. కొన్ని చోట్ల తీవ్రమైన కరువు వస్తుందని చెప్పారు. అలాగే మనుషులు అధునాతన రోబోలను తయారు చేస్తే అవి మానవులను నాశనం చేస్తాయట. ఈ విధంగా నాస్ట్రడామస్ చెప్పారు. అయితే ఆయన చెప్పినవి కొన్ని.. అంటే.. వరదలు వంటివి ఇప్పటికే ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. మరి 2022లో ఏం జరుగుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…