Nithya Menen : అందాల ముద్దుగుమ్మ నిత్యామీనన్ ఇటీవలి కాలంలో చేస్తున్న హంగామా మాములుగా లేదు. 1988 ఏప్రిల్ 8న జన్మించిన నిత్యా మీనన్.. 2008లో మలయాళ సినిమా ఆకాశ గోపురంలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె వెనుదిరిగి చూసుకోలేదు. 2011లో నాని హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అలా మొదలైంది మూవీలో కథానాయికగా తెలుగులో అడుగుపెట్టింది. అదే ఏడాది సిద్ధార్ధ్ హీరోగా నటించిన నూట్రెన్బంధు సినిమాతో తమిళంలో అడుగుపెట్టింది. ఈ సినిమా తెలుగులో 180 టైటిల్తో విడుదలైంది. మొత్తంగా 14 ఏళ్ల కెరీర్లో 50 కి పైగా చిత్రాల్లో నటించింది. 2019లో నిత్యా మీనన్ .. హిందీ ఇండస్ట్రీకి మిషన్ మంగళ్ సినిమాతో పరిచయమైంది. ఈ సినిమా బాలీవుడ్లో కమర్షియల్ సక్సెస్ సాధించింది. అటు హిందీలో అభిషేక్ బచ్చన్తో బ్రీత్ ఇన్ టూ షాడోస్ అనే వెబ్ సిరీస్లో నటించింది.
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేసి దూకుడు చూపించిన స్టార్ హీరోయిన్.. ఆతరువాత డల్ అయ్యింది. ఇక అడపా దడపా స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా మారిపోయింది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్తో తెలుగు ప్రేక్షకులను మరోమారు పలకరించింది. భీమ్లానాయక్ లో పవన్ భార్యగా నిత్య అలరించింది. ఈ పాత్రలో నిత్యమీనన్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇక నిత్య తన అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉండాలి అనుకుంటుంది.
కాగా అనుకున్నదే తడవుగా.. తన ఫాలోవర్లు, అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది నిత్యమీనన్. ఆమె తన సొంతంగా యూట్యూబ్ చానల్ను లాంచ్ చేసింది. దానికి నిత్య అన్ఫిల్టర్డ్ అని పేరు పెట్టింది. తన తొలి వీడియోను కూడా ఆ చానల్లో పోస్ట్ చేసింది. తన 12 ఏళ్ల కెరీర్కు చెందిన విషయాలను అందులో చెప్పింది. ఇక నిత్య ప్రస్తుతం ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్కు జడ్జిగా వ్యవహరిస్తోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…