Nithya Menen : అందాల ముద్దుగుమ్మ నిత్యామీనన్ ఇటీవలి కాలంలో చేస్తున్న హంగామా మాములుగా లేదు. 1988 ఏప్రిల్ 8న జన్మించిన నిత్యా మీనన్.. 2008లో మలయాళ సినిమా ఆకాశ గోపురంలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె వెనుదిరిగి చూసుకోలేదు. 2011లో నాని హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అలా మొదలైంది మూవీలో కథానాయికగా తెలుగులో అడుగుపెట్టింది. అదే ఏడాది సిద్ధార్ధ్ హీరోగా నటించిన నూట్రెన్బంధు సినిమాతో తమిళంలో అడుగుపెట్టింది. ఈ సినిమా తెలుగులో 180 టైటిల్తో విడుదలైంది. మొత్తంగా 14 ఏళ్ల కెరీర్లో 50 కి పైగా చిత్రాల్లో నటించింది. 2019లో నిత్యా మీనన్ .. హిందీ ఇండస్ట్రీకి మిషన్ మంగళ్ సినిమాతో పరిచయమైంది. ఈ సినిమా బాలీవుడ్లో కమర్షియల్ సక్సెస్ సాధించింది. అటు హిందీలో అభిషేక్ బచ్చన్తో బ్రీత్ ఇన్ టూ షాడోస్ అనే వెబ్ సిరీస్లో నటించింది.
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేసి దూకుడు చూపించిన స్టార్ హీరోయిన్.. ఆతరువాత డల్ అయ్యింది. ఇక అడపా దడపా స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా మారిపోయింది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్తో తెలుగు ప్రేక్షకులను మరోమారు పలకరించింది. భీమ్లానాయక్ లో పవన్ భార్యగా నిత్య అలరించింది. ఈ పాత్రలో నిత్యమీనన్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇక నిత్య తన అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉండాలి అనుకుంటుంది.
కాగా అనుకున్నదే తడవుగా.. తన ఫాలోవర్లు, అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది నిత్యమీనన్. ఆమె తన సొంతంగా యూట్యూబ్ చానల్ను లాంచ్ చేసింది. దానికి నిత్య అన్ఫిల్టర్డ్ అని పేరు పెట్టింది. తన తొలి వీడియోను కూడా ఆ చానల్లో పోస్ట్ చేసింది. తన 12 ఏళ్ల కెరీర్కు చెందిన విషయాలను అందులో చెప్పింది. ఇక నిత్య ప్రస్తుతం ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్కు జడ్జిగా వ్యవహరిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…