Chiranjeevi : టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు అని అడిగితే ముందుగా గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ఆయన సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుత విజయాలను సొంతం చేసుకున్నారు. పునాదిరాళ్లు చిత్రంతో చిరంజీవి తన కెరీర్ ని స్టార్ట్ చేసి దాదాపు 150 చిత్రాలకు పైగా నటించి సుప్రీం హీరోగా, మెగాస్టార్ గా ఎదిగి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగి మళ్లీ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా కూడా తెలుగు ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.
రాజకీయాల కారణంగా చిత్రాలకి ఇక దూరంగా ఉంటారు అనుకునే ఉద్దేశంతో ఉన్న ప్రజల అంచనాలను తారుమారు చేస్తూ ఖైదీ నెంబర్ 150 చిత్రంతో తిరిగి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఎంతో స్టార్ డమ్ ఉన్న మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారు. ఆయనకు ఈ మధ్య కష్టకాలం నడుస్తుంది అంటూ స్వయంగా ఆయన అభిమానులే కామెంట్ చేస్తున్నారు.
దాదాపు రెండు సంవత్సరాలు ఎదురు చూసిన ఆచార్య చిత్రం ప్రేక్షకులకు నిరాశను మిగిల్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పాలైంది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కూడా భారీ నష్టాలు చవి చూపించింది. ఆచార్య చిత్రం డిజాస్టర్ కావడంతో డైరెక్టర్ కొరటాల శివ కూడా తన ఆస్తులు అమ్ముకునే స్థితికి వచ్చేశారు. బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దాని తెలుగులో చిరంజీవి ప్రెజెంట్ చేసిన విషయం తెలిసిందే. అమీర్ ఖాన్, నాగచైతన్య కలిసి నటించిన లాల్ సింగ్ చద్దా దారుణమైన రిజల్ట్ అందుకుంది. ఆచార్య చిత్రం డిజాస్టర్ నుంచి తేరుకోకముందే లాల్ సింగ్ చద్దా చిత్రం రిజల్ట్ కూడా ఆయన్ని మరింత ఇబ్బంది పెట్టింది.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఫస్ట్ డే ఫస్ట్ షో చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో కూడా పాల్గొన్నారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇలా మెగాస్టార్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లకి పాల్గొన్న చిత్రాలన్నీ ఫ్లాపులను అందుకోవడంతో మెగాస్టార్ కి బ్యాడ్ టైం నడుస్తుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతోపాటు కొందరైతే ఏకంగా ఆయనను ఐరన్ లెగ్ అని అంటున్నారు. అయితే త్వరలో ఆయన నటించిన గాడ్ ఫాదర్ రిలీజ్ కానుంది. మరి ఈ మూవీ ఎలా అలరిస్తుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…