Nagarjuna : అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున హీరోగా సూపర్ సక్సెస్ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సమానంగా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సొంత చేసుకున్నాడు. కింగ్ నాగార్జున ఇండస్ట్రీలోకి వచ్చి చాలాకాలమే అయినప్పటికీ యంగ్ లుక్స్ తో కొడుకులకే పోటీ ఇస్తూ.. యంగ్ హీరోలకి కూడా తనదైన స్టైల్ లో దీటుగా సమాధానం ఇస్తున్నాడు. అయితే నాగార్జున ముందుగా దివంగత లెజెండ్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. నాగార్జున సినిమాల్లోకి రావడానికి ముందే శ్రీలక్ష్మితో వివాహమైంది. అప్పటికే ఈ దంపతులకు నాగచైతన్య జన్మించాడు.
ఆ తర్వాత శ్రీలక్ష్మితో విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్న నాగార్జున.. తనతో పాటు శివ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమలను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అందరికీ అమల అంటే గౌరవం, ప్రేమ. అందరితోనూ కలివిడిగా కలిసిపోయి వినయంగా ఉంటుంది. నిజానికి ప్రేమించిన వ్యక్తి కోసం తనని తాను చాలా మార్చుకుంది అమల. అలాగే నాగార్జునకు అమల అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎప్పటికీ అన్యోన్యంగా ఉంటారు. అయితే పెళ్లయిన కొత్తలో అమల నాగార్జునకు ఓ మాట చెప్పిందట. ఆ పని కచ్చితంగా చేసి తీరాల్సిందే అంటూ ప్రామిస్ చేయించుకుందట. ఆశ్చర్యం ఏంటంటే.. పెళ్లి అయ్యి ఇన్నాళ్లయినా కూడా నాగార్జున ఇప్పటికీ ఆ పని ఇంకా చేస్తూనే ఉన్నాడట.
ఇంతకీ ఆ పని ఏంటంటే.. అమల జంతు ప్రేమికురాలు.. అందుకోసం బ్లూ క్రాస్ ను రన్ చేస్తున్న విషయం తెలిసిందే. జంతువులకు ఏదైనా అయితే అమలు చూసి తట్టుకోలేదు. అందుకే అమల తన సంపాదనలో కొంత భాగం జంతువుల సంరక్షణ కోసం ఇస్తుంది. అదే విధంగా నాగార్జునను కూడా ఏటా తన సంపాదనలో కొంత జంతువుల సంరక్షణకు ఇవ్వాలని కండిషన్ పెట్టిందట. దానికి ఓకే చెప్పిన నాగార్జున ఇప్పటికీ ఏటా తన సంపాదనలో కొంత అమౌంట్ ఇస్తున్నాడట. ఈ విషయం తెలిసిన అభిమానులు అమలపై నాగార్జునకు ఎంత ప్రేమ ఉందో అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే నాగ్ సర్ ది గొప్ప మనసు అని అభినందిస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…