Ram Charan : దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఆయన వరల్డ్ వైడ్ గా ఎంతో ఫేమస్ అయిపోయారు. హాలీవుడ్ డైరెక్టర్లు సైతం అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే ఆయకు హాలీవుడ్ నుంచి కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. అంతేకాకుండా యాడ్స్లో నటించే అవకాశాలు కూడా పెరిగిపోయాయి. చరణ్ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని చాలా కంపెనీలు ఆయన ఇంటి ముందుకు క్యూ కడుతున్నాయి. ఒక యాడ్ కి రామ్ చరణ్ కి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కూడా వెనకాడటం లేదు.
తాజాగా రామ్ చరణ్ హీరో బైక్ యాడ్ చేయడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఆ యాడ్కు సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. మరి కొద్ది రోజుల్లో హీరో బైక్ యాడ్ తో రామ్ చరణ్ జనాల ముందుకు రాబోతున్నారు. ఈ హీరో బైక్ యాడ్లో నటించటానికి రామ్ చరణ్ భారీగా ఛార్జ్ చేశారని టాక్ వినిపిస్తుంది. ఈ యాడ్ కోసం రామ్ చరణ్ 7 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇంటర్నేషనల్ గా ఎంతో మంచి క్రేజ్ వున్న రామ్ చరణ్ కి రూ.7 కోట్లు ఆఫర్ అనేది చాలా తక్కువ అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో ఆర్సి15 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడీగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం డైరెక్టర్ శంకర్ కి ప్రొడ్యూసర్ దిల్ రాజుకి 50వ చిత్రం కావడంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అనే విషయాలు వెల్లడవుతున్నాయి. డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ గా తెలుగులో తీస్తున్న మొదటి చిత్రం ఇది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…