Mohan Babu : సీనియర్ నటుడు మోహన్ బాబుపై ట్రోల్స్ ఇప్పట్లో ఆగేలా లేవు. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా నెటిజన్లు ఈ మధ్య కాలంలో తరచూ ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఈ ట్రోల్స్ ఎక్కువయ్యాయని చెప్పవచ్చు. అలాగే ఏపీలో సినీ రంగ సమస్యలను పరిష్కరించడంలోనూ మంచు విష్ణు ఫెయిల్ అయ్యారని చెప్పి నెటిజన్లు అప్పటి నుంచి మంచు ఫ్యామిలీని టార్గెట్ చేశారు. దీంతో ఎప్పటికప్పుడు మంచు ఫ్యామిలీపై ట్రోల్స్ పెరిగిపోతూనే ఉన్నాయి.
ఇక మోహన్బాబు నటించిన సన్నాఫ్ ఇండియా మూవీపై అయితే ఏ తెలుగు సినిమాపై రానన్ని ట్రోల్స్ వచ్చాయి. దీంతో నొచ్చుకున్న మంచు మోహన్ బాబు, విష్ణు తమను ట్రోల్ చేస్తే రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. అయితే దీనిపై కూడా ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఆ తరువాత వారు సైలెంట్ అయిపోయారు కానీ వారిపై వచ్చే ట్రోల్స్ మాత్రం ఆగలేదు. ఇక తాజాగా మరోమారు మంచు మోహన్ బాబు దొరికిపోయారు. ఆయనను ఒక రేంజ్లో నెటిజన్లు ఆడుకుంటున్నారు. తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఆయనపై విమర్శలు కూడా వస్తున్నాయి.
మంచు లక్ష్మి నటిస్తూ నిర్మిస్తున్న మూవీ అగ్ని నక్షత్రం. ఇందులో ఆమెతోపాటు మోహన్ బాబు కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇందులో తాను ప్రొఫెసర్ విశ్వామిత్రగా నటిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. అయితే ఆ ట్వీట్కు చివర్లో తనకు భయంగా ఉందని చెప్పారు. ఇదే నెటిజన్లకు అస్త్రంగా మారింది. ఈ వాక్యాన్ని ఉద్దేశించే ఆయనను మరోమారు ట్రోల్ చేస్తూ తీవ్రంగా విమర్శిస్తున్నారు.
సినిమా తీస్తున్న మీకే ఇంత భయంగా ఉంటే.. దాన్ని చూసే మాకు ఎంత భయంగా ఉండాలి.. అని నెటిజన్లు ఆయన ట్వీట్కు కౌంటర్ ఇస్తున్నారు. అలాగే సన్నాఫ్ ఇండియా సెకండ్ పార్ట్ రాబోతోంది.. అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇక కొందరైతే మోహన్ బాబును ఫైర్ స్టార్ అంటూ ఆట పట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అనవసరంగా ట్రోలింగ్కు గురవుతున్నారని అర్థమవుతోంది. అయితే దీనిపై ఆయన గానీ.. మంచు ఫ్యామిలీగానీ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…