OTT : వారం వారం ఓటీటీల్లో ప్రస్తుతం కొత్త సినిమాలు, సిరీస్లు సందడి చేస్తున్నాయి. థియేటర్ల కన్నా ఓటీటీల్లో సినిమాలను చూసేందుకే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ సినిమాలకు వసూళ్లు మాత్రం రావడం లేదు. ప్రేక్షకులు లేక అనేక చోట్ల థియేటర్లకు భారీ ఎత్తున నష్టాలు వస్తున్నాయి. అయితే ఇది ఎంత కాలం ఉంటుందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మళయాళం స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన మళయాళం మూవీ కడువ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇక ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 4వ తేదీన స్ట్రీమ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్గా ఈ మూవీని తెరకెక్కించారు. అలాగే ఆలియా భట్ నటించిన డార్లింగ్స్ అనే మూవీ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది. కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లో నేరుగా రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 4వ తేదీనే ఈ మూవీ కూడా విడుదల కానుంది.
గోపీ చంద్, రాశిఖన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన పక్కా కమర్షియల్ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సాధించినా.. కలెక్షన్లు మాత్రం రాలేదు. ఇక ఈ మూవీ ఈ వారం ఓటీటీలోకి రానుంది. ఆహా వీడియోతోపాటు నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీని ఆగస్టు 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అలాగే ది శాండ్ మాన్ అనే ఇంగ్లిష్ సిరీస్ సైతం నెట్ ఫ్లిక్స్లో ఈ వారమే స్ట్రీమ్ కానుంది. సై-ఫై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్ను ఆగస్టు 5 నుంచి స్ట్రీమ్ చేయనున్నారు. ఇలా పలు సినిమాలు, సిరీస్లు ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…