Shahrukh Khan : ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కి పట్టుబడిన విషయం విదితమే. ముంబై తీర ప్రాంతంలో ఓ క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారంటూ అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించిన ఎన్సీబీ అధికారులు ఆర్యన్ సహా పలువురు ప్రముఖులకు చెందిన పిల్లలు మొత్తం 11 మందిని అరెస్టు చేశారు.
కాగా ఆర్యన్ఖాన్ను విచారణకు కస్టడీకి అనుమతించాల్సిందిగా ఎన్సీబీ కోర్టును కోరింది. అందుకు కోర్టు కూడా అంగీకరించింది. దీంతో ఈ సంఘటన బాలీవుడ్ను భారీగా కుదిపేస్తోంది. మరోవైపు షారుఖ్ అభిమానులు ఆయనకు మద్దతుగా విస్టాండ్విత్ షారూఖ్ పేరిట హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు షారుఖ్కు మద్దతుగా నిలిచారు.
అయితే భారీ ఎత్తున నెటిజన్లు మాత్రం షారుఖ్ను, అతని కుమారుడు ఆర్యన్ను విడిచిపెట్టడం లేదు. వారిద్దరినీ దారుణంగా విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. తండ్రేమో బైజూస్లో చదువుకోమని విద్యార్థులకు పాఠాలు చెబుతుంటే.. కొడుకేమో డ్రగ్స్ తీసుకుంటున్నాడు.. అని కామెంట్లు చేస్తున్నారు.
అయితే 1997లో షారుఖ్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను యుక్త వయస్సులో ఎంజాయ్ చేయలేకపోయానని, కనుక తన కుమారుడికి అన్నింటినీ ఎంజాయ్ చేసే స్వేచ్ఛను కల్పిస్తానని తెలిపాడు. డ్రగ్స్ తీసుకోవడం, అమ్మాయిలతో గడపడం వంటి చేసేందుకు తన కుమారుడికి అనుమతిస్తానని షారుఖ్ అన్నాడు. దీంతో అప్పట్లో షారుఖ్ యాదృచ్ఛికంగానే ఆ వ్యాఖ్యలు చేసినా.. ఇప్పుడు అన్నంత పనీ అయింది. దీంతో అప్పటి వీడియోల తాలూకు క్లిప్స్ ను నెటిజన్లు షేర్ చేస్తూ.. షారుఖ్ ను ఇంకా దారుణంగా విమర్శిస్తున్నారు. ఓ తండ్రి ఇలాంటి మాటలేనా మాట్లాడాల్సింది, కొడుకును ఈ విధంగానేనా తయారు చేయాల్సింది ? అని ప్రశ్నిస్తున్నారు.
అయితే రేపో మాపో ఆర్యన్ ఖాన్ను బాలీవుడ్ లో తెరంగేట్రం చేయాలని షారుఖ్ భావించారు. అంతలోనే ఈ విధంగా జరగడం వారికి పెద్ద షాక్ ను ఇచ్చిందని చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…