Poonam Kaur : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ప్రకాష్ రాజ్ విజయం సాధిస్తే తనను మోసం చేసిన వ్యక్తి గురించి చెబుతానని ఈమె బహిరంగంగా ప్రకటన చేసింది. తరువాత ఆ ట్వీట్ను ఆమె డిలీట్ చేసింది. కానీ ప్రకాష్ రాజ్ అయితే గెలవలేదు. దీంతో ఆమె ప్రకటన అలాగే ఉండిపోయింది. ఇక ఇలాంటి వివాదాస్పద ట్వీట్లు చేయడంలో పూనమ్ కౌర్ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. కానీ ట్వీట్లు చేశాక వాటిని డిలీట్ చేస్తుంటుంది.
ఇక తాజాగా పూనమ్ కౌర్ మరోమారు వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఈమె ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఆమె పెట్టే ట్వీట్లు వివాదాస్పదం అయినట్లుగానే తాజాగా ఆమె పెట్టిన ఫొటో ఒకటి చర్చకు దారి తీస్తోంది. ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన పూనమ్ దానికి హ్యాపీనెస్ అనే కామెంట్ కూడా పెట్టింది. అయితే వారు ఎవరి పిల్లలు ? అనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఆ పిల్లలు ఎవరు పూనమ్ ? అని నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే అందుకు ఆమె సమాధానం చెప్పలేదు. మరి దీనికి ఆమె సమాధానం చెబుతుందో లేదో చూడాలి. ఇక వారు బంధువుల పిల్లలు అయి ఉంటారని తెలుస్తోంది. కాగా పూనమ్ కౌర్ వెండితెరకు దూరం అయి చాలా కాలమే అవుతోంది. ఇటీవలే ఆమె మళ్లీ వెండితెరపై సందడి చేసింది. ఆమె నటించిన నాతి చరామి అనే సినిమా విడుదలైంది. అయితే ఈ మూవీ వచ్చి వెళ్లినట్లు కూడా చాలా మందికి తెలియదు. ఇక పూనమ్ కౌర్ సినిమాల కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టివ్గా ఉంటూ అనేక సామాజిక, సినిమా అంశాల పట్ల స్పందిస్తోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…