Sania Mirza : భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా భారత దేశ పౌరసత్వాన్ని రద్దు చేయాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా కు టాగ్ చేస్తూ ఈమె పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈమె పౌరసత్వాన్ని ఎందుకు రద్దు చేయాలి అనే విషయానికి వస్తే.. టీ20 ప్రపంచకప్ 2021 లో గురువారం ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్లో భాగంగా పాకిస్థాన్ క్రికెటర్లను ఉత్సాహపరిచేందుకు వెళ్ళిన సానియా మీర్జా.. పాకిస్థాన్ క్రికెటర్లను ప్రోత్సహిస్తూ స్టేడియంలో కనిపించడంతో ఎంతో మంది నెటిజన్లు ఈమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆమెపై దారుణంగా ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఆమెపై ఉపా చట్టం పెట్టి దేశ పౌరసత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె పాకిస్తాన్ కి మద్దతు తెలపడంతో చాలామంది శత్రు దేశానికి ఎలా మద్దతు తెలుపుతారు.. అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పాక్ పేసర్ హసన్ అలీ భార్యని, తన కుటుంబ సభ్యులను కూడా పాకిస్తాన్ ప్రజలు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అతను చివరి ఓవర్లలో ఆసీస్ బ్యాట్స్మెన్ క్యాచ్ పట్టలేదు. దీంతో పాక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆ దేశ ప్రజలు తమ బ్యాట్స్మన్ను ట్రోల్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…