Nayanthara : లేడీ సూపర్ స్టార్గా పేరుగాంచిన నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ ఎన్నో ఏళ్ల తమ ప్రేమ బంధానికి ముగింపు పలికి ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం విదితమే. జూన్ 9వ తేదీన వీరు మహాబలిపురంలోని గ్రాండ్ షెరటాన్ హోటల్లో అంగరంగవైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరు ఆ ఒక్క రోజు తమిళనాడులోని సుమారు 1 లక్ష మంది పేదలకు అన్నదానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. అయితే వీరి పెళ్లికి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. కానీ ఒక్క వ్యక్తిని మాత్రం పెళ్లికి ఎందుకు పిలిచావంటూ నయనతారపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
మళయాళ నటుడు దిలీప్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులు పెద్దగా పరిచయం లేదు. కానీ తమిళం, మళయాళం ప్రేక్షకులకు బాగానే తెలుసు. అయితే అప్పట్లో ఇతనిపై హీరోయిన్ భావన సంచలన ఆరోపణలు చేసింది. తన సోదరుడితో కలిసి దిలీప్ కుమార్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని భావన ఆరోపణలు చేసింది. అయితే అలాంటి వ్యక్తిని నీ పెళ్లికి ఎందుకు పిలిచావు.. అతన్ని పిలవాల్సిన అవసరం ఏముంది.. అంటూ నయనతారను ప్రశ్నిస్తూ.. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
ఇక నయనతార ఇటీవలే భర్త విగ్నేష్తో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అయితే మాడ వీధుల్లో వీరు చెప్పులు ధరించి తిరగడం వివాదాస్పదం అయింది. దీంతో వారిని టీటీడీ వివరణ కోరింది. ఈ క్రమంలోనే నయన్, విగ్నేష్ దంపతులు టీటీడీకి లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…