Neha Shetty : సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన తాజా చిత్రం.. డీజే టిల్లు. ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా.. అది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అందులో హీరో సిద్ధు డైలాగ్స్, మ్యానరిజంతోపాటు హీరోయిన్ నేహా శెట్టి అందాల ఆరబోత, గ్లామర్ షోకు యువత ఫిదా అయ్యారు. దీంతో విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్ వైరల్గా మారింది. ప్రస్తుతం ఈ మూవీ గురించి చాలా మంది చర్చించుకుంటున్నారు.
ఇక ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో హీరోయిన్ నేహా శెట్టిని ఓ ఫిలిం జర్నలిస్టు అనుచిత ప్రశ్న అడిగాడు. సినిమాలో హీరో నీ శరీరంపై పుట్టు మచ్చలు ఎన్ని ఉన్నాయంటే అందుకు మీరు 16 అని చెప్పారు. నిజంగానే మీ శరీరంపై ఉన్న పుట్టు మచ్చలను సిద్ధు అడిగి తెలుసుకున్నారా.. ఆయనకు చెప్పారా.. అంటూ ఆ జర్నలిస్టు నేహాను అడిగాడు. దీంతో అక్కడే ఉన్న సిద్ధు ఆ ప్రశ్నను వదిలేద్దాం.. అని చెప్పారు.
అయితే ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఆ జర్నలిస్టు అలాంటి ప్రశ్న అడగడంపై నేహా అసహనం వ్యక్తం చేసింది. ఇందుకు గాను నిర్మాత ఆమెకు క్షమాపణలు కూడా చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో మాత్రం చర్చకు దారి తీసింది. దీంతో కొందరు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇక కొందరు మాత్రం ఆమెను విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే తనపై వస్తున్న ట్రోల్స్కు నేహా స్పందించింది.
తాజాగా ఇదే విషయంపై ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనను ఎవరు ఎన్ని రకాలుగా విమర్శించినా.. ట్రోల్ చేసినా.. పట్టించుకోనని.. తనపై అవి ప్రభావం చూపించలేవని తెలియజేసింది. తాను గడిచిన సంఘటనల గురించి ఆలోచిస్తూ టైమ్ వేస్ట్ చేయనని.. భవిష్యత్ ప్రణాళికలను వేసుకుంటానని చెప్పింది. తాను ప్రస్తుతం సినిమా కెరీర్ పరంగా సంతోషంగానే ఉన్నానని.. తనకు వచ్చే అవకాశాలను వదులుకోకుండా చేస్తానని చెప్పింది. కథ మంచిగా అనిపిస్తే నటిస్తానని.. తనకు నటనలో ఎలాంటి కండిషన్స్ లేవని, ఎలాంటి పాత్ర అయినా చేస్తానని చెప్పింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…