Neha Shetty : సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన తాజా చిత్రం.. డీజే టిల్లు. ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా.. అది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అందులో హీరో సిద్ధు డైలాగ్స్, మ్యానరిజంతోపాటు హీరోయిన్ నేహా శెట్టి అందాల ఆరబోత, గ్లామర్ షోకు యువత ఫిదా అయ్యారు. దీంతో విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్ వైరల్గా మారింది. ప్రస్తుతం ఈ మూవీ గురించి చాలా మంది చర్చించుకుంటున్నారు.
ఇక ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో హీరోయిన్ నేహా శెట్టిని ఓ ఫిలిం జర్నలిస్టు అనుచిత ప్రశ్న అడిగాడు. సినిమాలో హీరో నీ శరీరంపై పుట్టు మచ్చలు ఎన్ని ఉన్నాయంటే అందుకు మీరు 16 అని చెప్పారు. నిజంగానే మీ శరీరంపై ఉన్న పుట్టు మచ్చలను సిద్ధు అడిగి తెలుసుకున్నారా.. ఆయనకు చెప్పారా.. అంటూ ఆ జర్నలిస్టు నేహాను అడిగాడు. దీంతో అక్కడే ఉన్న సిద్ధు ఆ ప్రశ్నను వదిలేద్దాం.. అని చెప్పారు.
అయితే ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఆ జర్నలిస్టు అలాంటి ప్రశ్న అడగడంపై నేహా అసహనం వ్యక్తం చేసింది. ఇందుకు గాను నిర్మాత ఆమెకు క్షమాపణలు కూడా చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో మాత్రం చర్చకు దారి తీసింది. దీంతో కొందరు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇక కొందరు మాత్రం ఆమెను విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే తనపై వస్తున్న ట్రోల్స్కు నేహా స్పందించింది.
తాజాగా ఇదే విషయంపై ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనను ఎవరు ఎన్ని రకాలుగా విమర్శించినా.. ట్రోల్ చేసినా.. పట్టించుకోనని.. తనపై అవి ప్రభావం చూపించలేవని తెలియజేసింది. తాను గడిచిన సంఘటనల గురించి ఆలోచిస్తూ టైమ్ వేస్ట్ చేయనని.. భవిష్యత్ ప్రణాళికలను వేసుకుంటానని చెప్పింది. తాను ప్రస్తుతం సినిమా కెరీర్ పరంగా సంతోషంగానే ఉన్నానని.. తనకు వచ్చే అవకాశాలను వదులుకోకుండా చేస్తానని చెప్పింది. కథ మంచిగా అనిపిస్తే నటిస్తానని.. తనకు నటనలో ఎలాంటి కండిషన్స్ లేవని, ఎలాంటి పాత్ర అయినా చేస్తానని చెప్పింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…