Neha Shetty : సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన తాజా చిత్రం.. డీజే టిల్లు. ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా.. అది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అందులో హీరో సిద్ధు డైలాగ్స్, మ్యానరిజంతోపాటు హీరోయిన్ నేహా శెట్టి అందాల ఆరబోత, గ్లామర్ షోకు యువత ఫిదా అయ్యారు. దీంతో విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్ వైరల్గా మారింది. ప్రస్తుతం ఈ మూవీ గురించి చాలా మంది చర్చించుకుంటున్నారు.
ఇక ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో హీరోయిన్ నేహా శెట్టిని ఓ ఫిలిం జర్నలిస్టు అనుచిత ప్రశ్న అడిగాడు. సినిమాలో హీరో నీ శరీరంపై పుట్టు మచ్చలు ఎన్ని ఉన్నాయంటే అందుకు మీరు 16 అని చెప్పారు. నిజంగానే మీ శరీరంపై ఉన్న పుట్టు మచ్చలను సిద్ధు అడిగి తెలుసుకున్నారా.. ఆయనకు చెప్పారా.. అంటూ ఆ జర్నలిస్టు నేహాను అడిగాడు. దీంతో అక్కడే ఉన్న సిద్ధు ఆ ప్రశ్నను వదిలేద్దాం.. అని చెప్పారు.
అయితే ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఆ జర్నలిస్టు అలాంటి ప్రశ్న అడగడంపై నేహా అసహనం వ్యక్తం చేసింది. ఇందుకు గాను నిర్మాత ఆమెకు క్షమాపణలు కూడా చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో మాత్రం చర్చకు దారి తీసింది. దీంతో కొందరు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇక కొందరు మాత్రం ఆమెను విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే తనపై వస్తున్న ట్రోల్స్కు నేహా స్పందించింది.
తాజాగా ఇదే విషయంపై ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనను ఎవరు ఎన్ని రకాలుగా విమర్శించినా.. ట్రోల్ చేసినా.. పట్టించుకోనని.. తనపై అవి ప్రభావం చూపించలేవని తెలియజేసింది. తాను గడిచిన సంఘటనల గురించి ఆలోచిస్తూ టైమ్ వేస్ట్ చేయనని.. భవిష్యత్ ప్రణాళికలను వేసుకుంటానని చెప్పింది. తాను ప్రస్తుతం సినిమా కెరీర్ పరంగా సంతోషంగానే ఉన్నానని.. తనకు వచ్చే అవకాశాలను వదులుకోకుండా చేస్తానని చెప్పింది. కథ మంచిగా అనిపిస్తే నటిస్తానని.. తనకు నటనలో ఎలాంటి కండిషన్స్ లేవని, ఎలాంటి పాత్ర అయినా చేస్తానని చెప్పింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…