Nayanthara : లేడీ సూపర్ స్టార్గా పేరుగాంచిన నయనతార ఈ మధ్యే దర్శకుడు విగ్నేష్ శివన్ను పెళ్లి చేసుకున్న విషయం విదితమే. జూన్ 9వ తేదీన వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు అనేక మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. అయితే మాడ వీధుల్లో వీరు చెప్పులు వేసుకుని తిరగడం వివాదాస్పదం అయింది. దీంతో టీటీడీ వివరణ అడగ్గా.. వీరు క్షమాపణలు చెప్పారు. అయితే నయనతార ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉండగా.. కనీసం పెళ్లి అయ్యాక అయినా.. ఈమె కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకుంటుందని అనుకున్నారు. కానీ నయనతార మళ్లీ షూటింగ్లతో బిజీ కానుంది.
కొత్తగా పెళ్లయినప్పటికీ నయనతార సినిమాల నుంచి మాత్రం బ్రేక్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఆమె ఇప్పటికే షారూక్ ఖాన్ మూవీలో నటించాల్సి ఉంది. అట్లీ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. జవాన్ పేరిట ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో మొదట సమంతను అనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల ఆమె నో చెప్పగా.. నయనతారను ఆమె ప్లేస్లో తీసుకున్నారు. అయితే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. ఇందులో షారూక్ ఖాన్కు చెందిన సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే నయనతార ఈ చిత్ర యూనిట్తో త్వరలో కలవనుంది.
ఇక చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలనూ నయనతార నటిస్తోంది. ఇందులో ఆయన చెల్లెలి పాత్రలో నయనతార నటిస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరో రెండు మూడు రోజుల్లో ఈమె హైదరాబాద్కు వెళ్లనుందని సమాచారం. అయితే నయనతార తాను చేస్తున్న చిత్రాలకు చెందిన షూటింగ్ను త్వరగా పూర్తి చేసుకుని ఆ తరువాత బ్రేక్ తీసుకుంటుందని తెలుస్తోంది. ఇంతకు ముందు సోనమ్కపూర్, కాజల్ అగర్వాల్ కూడా ఇలాగే చేశారు. కనుక కొత్తగా పెళ్లయినప్పటికీ నయనతార మాత్రం బ్రేక్ తీసుకోవడం లేదని స్పష్టం అవుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…