Nara Lokesh : సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెదేపా నాయకుడు పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కొందరు వైసీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఏపీలోని పలు టీడీపీ ఆఫీస్ లపై దాడులు చేసిన విషయం విదితమే. అయితే దీనిపై వైసీపీ నాయకులు స్పందించారు. దాడికి పాల్పడింది టీడీపీ వాళ్లేనని.. తమపై తామే దాడులు చేయించుకుని ప్రజల్లో సానుభూతి పొందడం చంద్రబాబుకు అలవాటైన పనే అని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే ఈ సంఘటనలపై టీడీపీ నాయకుడు నారా లోకేష్ స్పందించారు.
టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ.. పెంపుడు కుక్కలను తమపై దాడికి పంపుతారా ? అని ప్రశ్నించారు. తాడేపల్లి క్యాంపు ఆఫీస్ లో సీఎం జగన్ దాక్కున్నారని ఆరోపించారు. దమ్ముంటే బయటకు వచ్చి తమను ఎదుర్కోవాలని, ప్లేస్, టైమ్ చెప్పాలని సవాల్ విసిరారు. వైసీపీ నేతలు చేసే దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదని లోకేష్ అన్నారు.
కాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై బుధవారం బంద్కు పిలుపునిచ్చిన టీడీపీ.. మరిన్ని నిరసన కార్యక్రమాలను రాష్ట్రమంతటా చేపట్టింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గురువారం నుంచి 36 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నట్లు చెప్పారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…