Nara Lokesh : సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెదేపా నాయకుడు పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కొందరు వైసీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఏపీలోని పలు టీడీపీ ఆఫీస్ లపై దాడులు చేసిన విషయం విదితమే. అయితే దీనిపై వైసీపీ నాయకులు స్పందించారు. దాడికి పాల్పడింది టీడీపీ వాళ్లేనని.. తమపై తామే దాడులు చేయించుకుని ప్రజల్లో సానుభూతి పొందడం చంద్రబాబుకు అలవాటైన పనే అని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే ఈ సంఘటనలపై టీడీపీ నాయకుడు నారా లోకేష్ స్పందించారు.
టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ.. పెంపుడు కుక్కలను తమపై దాడికి పంపుతారా ? అని ప్రశ్నించారు. తాడేపల్లి క్యాంపు ఆఫీస్ లో సీఎం జగన్ దాక్కున్నారని ఆరోపించారు. దమ్ముంటే బయటకు వచ్చి తమను ఎదుర్కోవాలని, ప్లేస్, టైమ్ చెప్పాలని సవాల్ విసిరారు. వైసీపీ నేతలు చేసే దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదని లోకేష్ అన్నారు.
కాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై బుధవారం బంద్కు పిలుపునిచ్చిన టీడీపీ.. మరిన్ని నిరసన కార్యక్రమాలను రాష్ట్రమంతటా చేపట్టింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గురువారం నుంచి 36 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నట్లు చెప్పారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…