Nara Lokesh : సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెదేపా నాయకుడు పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కొందరు వైసీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఏపీలోని పలు టీడీపీ ఆఫీస్ లపై దాడులు చేసిన విషయం విదితమే. అయితే దీనిపై వైసీపీ నాయకులు స్పందించారు. దాడికి పాల్పడింది టీడీపీ వాళ్లేనని.. తమపై తామే దాడులు చేయించుకుని ప్రజల్లో సానుభూతి పొందడం చంద్రబాబుకు అలవాటైన పనే అని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే ఈ సంఘటనలపై టీడీపీ నాయకుడు నారా లోకేష్ స్పందించారు.
టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ.. పెంపుడు కుక్కలను తమపై దాడికి పంపుతారా ? అని ప్రశ్నించారు. తాడేపల్లి క్యాంపు ఆఫీస్ లో సీఎం జగన్ దాక్కున్నారని ఆరోపించారు. దమ్ముంటే బయటకు వచ్చి తమను ఎదుర్కోవాలని, ప్లేస్, టైమ్ చెప్పాలని సవాల్ విసిరారు. వైసీపీ నేతలు చేసే దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదని లోకేష్ అన్నారు.
కాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై బుధవారం బంద్కు పిలుపునిచ్చిన టీడీపీ.. మరిన్ని నిరసన కార్యక్రమాలను రాష్ట్రమంతటా చేపట్టింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గురువారం నుంచి 36 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నట్లు చెప్పారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…