Nagarjuna : గురువారం అక్కినేని నాగార్జున ఉన్నట్టుండి గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షం అయ్యారు. సడెన్గా అటు ఎందుకు వెళ్లారా.. అని అందరూ ఆలోచిస్తున్న సమయంలో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ను కలిశారు. వీరి సమావేశం దాదాపు గంటపాటు జరిగింది. వీరి సమావేశం అనంతరం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగ్.
‘విజయవాడకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సీఎం జగన్ నా శ్రేయోభిలాషి. జగన్మోహన్ రెడ్డిని చూసి చాలా రోజులవుతోంది. అందువల్ల విజయవాడ వచ్చాను. జగన్తో కలిసి లంచ్ చేశాను. ఇది నా వ్యక్తిగత పర్యటన. ఇండస్ట్రీ గురించి ఎలాంటి చర్చ జరగలేదు’ అని నాగార్జున తెలిపారు. అనంతరం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వచ్చారు నాగ్.
సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు తదితర అంశాలపై నాగార్జు, జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై స్పష్టత రాలేదు. కానీ.. నాగార్జున మాత్రం ఎలాంటి ఇతర అంశాలపై చర్చించలేదని, వ్యక్తిగతంగానే సీఎంను కలిసినట్లు మీడియాకు స్పష్టం చేశారు. నాగార్జున వెంట నిర్మాతలు ప్రీతం రెడ్డి, నిరంజన్ రెడ్డి ఉన్నారు.
నాగార్జున సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చైతూతో సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు చిత్రం చేస్తున్నారు. ఇందులో నాగ్ సరసన రమ్య కృష్ణ, చైతూకి జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. మరో వైపు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. అయితే సినీ రంగానికి చెందిన అంశాలపై మాట్లాడాల్సి వస్తే కేవలం నాగ్ ఇద్దరు నిర్మాతలను వెంట బెట్టుకుని వెళ్లరు కదా.. కనుక నాగ్ చెప్పినట్లు వ్యక్తిగత విషయాలను చర్చించేందుకే సీఎం జగన్ను ఆయన కలిసినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే నాగార్జున సడెన్గా సీఎం జగన్ను కలవడం చర్చనీయాంశంగా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…