Vaishnav Tej : మెగా ఫ్యామిలీ నుండి ఏ హీరో వచ్చినా కూడా మంచి సక్సెస్ సాధిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ‘ఉప్పెన’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ రీసెంట్గా కొండ పొలం చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చాడు. ఇందులో ఓబులమ్మగా రకుల్ కనిపించింది. కటారి రవీంద్ర పాత్రలో వైష్ణవ్ తేజ్ కనిపించి మెప్పించాడు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా కొండపొలం చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్.
నవలలో ఎక్కువ భాగం కథ నల్లమల అడవులలోని గొర్రెకాపరుల జీవితాలపై నడుస్తుంది. బీటెక్ చేసిన ఓ కుర్రాడు.. తన తండ్రితో తమ గొర్రెలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు.. బీటెక్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్గా ఎందుకు మారాడు.. వంటి అంశాలు నవలలో ప్రధాన అంశాలు. వాటిని ఆధారంగా చేసుకొని క్రిష్ చిత్రాన్ని తెరకెక్కించాడు. చిత్రం అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిలు నిర్మించారు.
అక్టోబర్ 8న విడుదలైన ఈ సినిమాపై మరిన్నిఅంచనాలు పెంచేందుకు బిగ్ బాస్ షోకి హాజరైంది చిత్ర బృందం. క్రిష్, వైష్ణవ్ తేజ్ బిగ్ బాస్ షోకి హాజరు కాగా వారు నాగార్జునతో కలిసి సందడి చేశారు. ఇంత చిన్న వయస్సులో రకుల్ని ఎలా ప్రేమించావు అని నాగార్జున ప్రశ్నించగా, దానికి తప్పలేదు అని చెప్పాడు. ఇక క్రిష్ తను హమీదా కోసం ఏదైనా చేసే వాడిని అన్నాడు. మీరు 45 రోజులు అడవులలో షూట్ చేస్తే మా వాళ్లు 105 రోజులు ఇక్కడ ఉండనున్నారని నాగార్జున అన్నారు. నేటి షో సందడిగా సాగనున్నట్టు తెలుస్తోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…