సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నటులలో నాగబాబు కూడా ఒకరు అని చెప్పవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత అటు రాజకీయాల్లోనూ, ఇటు అప్పుడప్పుడూ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా మారిపోయారు నాగబాబు. అంతేకాకుండా బుల్లితెరపై కూడా కొన్ని కార్యక్రమాలకి జడ్జిగా వ్యవహరిస్తూ అలరిస్తున్నారు.
జనసేన పార్టీని స్థాపించిన తర్వాత ఎదుటి వారు చేసే కామెంట్లకు సోషల్ మీడియాలో తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ హల్ చల్ చేస్తున్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించే సభలో ఏర్పాట్లను పరిశీలిస్తూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, జనసేన పార్టీ గెలవడానికి కావల్సిన కసరత్తులు మొదలుపెట్టారు నాగబాబు.
అయితే ఇప్పుడు అదే విధంగా నాగబాబు చేసిన ఒక పోస్ట్ నెటిజన్లు చూపులను ఆకర్షించింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయానికి వస్తే.. ఏమంటారు బాయ్స్ అంటూ ట్విట్టర్ ద్వారా ఒక ఆసక్తికరమైన మెసేజ్ పోస్ట్ చేశారు నాగబాబు. ఆ మెసేజ్ ఏంటంటే.. మనుషుల్ని వదులుకోవడానికి నేను ఇష్టపడను.. ఒకవేళ ఎవరినైనా వదులుకున్నానంటే వాడంత వెధవ ఎవడూ ఉండడు.. అంటూ ఒక స్మార్ట్ లుక్ ఇమేజ్ తో ట్వీట్ పోస్ట్ చేశారు.
అయితే నాగబాబు చేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఎవరిని ఉద్దేశించి ఇలాగ పోస్ట్ చేశారు అనే విషయంపై కామెంట్స్ వర్షం కురుస్తోంది. మీరు చెప్పింది కరెక్ట్ సార్ అంటూ ఒకరు.. ఏంటి సార్ ఈ కొత్త లుక్ వెనుక ఉన్న ఆంతర్యం.. అంటూ మరొకరు, ఇన్ డైరెక్ట్ గా ఎవరి గురించి చెబుతున్నారు సార్.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి గురించి నాగబాబు ఇలా కామెంట్ చేస్తూ ఎందుకు ట్వీట్ చేశారు.. అనే విషయం తెలియాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…