సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నటులలో నాగబాబు కూడా ఒకరు అని చెప్పవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత అటు రాజకీయాల్లోనూ, ఇటు అప్పుడప్పుడూ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా మారిపోయారు నాగబాబు. అంతేకాకుండా బుల్లితెరపై కూడా కొన్ని కార్యక్రమాలకి జడ్జిగా వ్యవహరిస్తూ అలరిస్తున్నారు.
జనసేన పార్టీని స్థాపించిన తర్వాత ఎదుటి వారు చేసే కామెంట్లకు సోషల్ మీడియాలో తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ హల్ చల్ చేస్తున్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించే సభలో ఏర్పాట్లను పరిశీలిస్తూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, జనసేన పార్టీ గెలవడానికి కావల్సిన కసరత్తులు మొదలుపెట్టారు నాగబాబు.
అయితే ఇప్పుడు అదే విధంగా నాగబాబు చేసిన ఒక పోస్ట్ నెటిజన్లు చూపులను ఆకర్షించింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయానికి వస్తే.. ఏమంటారు బాయ్స్ అంటూ ట్విట్టర్ ద్వారా ఒక ఆసక్తికరమైన మెసేజ్ పోస్ట్ చేశారు నాగబాబు. ఆ మెసేజ్ ఏంటంటే.. మనుషుల్ని వదులుకోవడానికి నేను ఇష్టపడను.. ఒకవేళ ఎవరినైనా వదులుకున్నానంటే వాడంత వెధవ ఎవడూ ఉండడు.. అంటూ ఒక స్మార్ట్ లుక్ ఇమేజ్ తో ట్వీట్ పోస్ట్ చేశారు.
అయితే నాగబాబు చేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఎవరిని ఉద్దేశించి ఇలాగ పోస్ట్ చేశారు అనే విషయంపై కామెంట్స్ వర్షం కురుస్తోంది. మీరు చెప్పింది కరెక్ట్ సార్ అంటూ ఒకరు.. ఏంటి సార్ ఈ కొత్త లుక్ వెనుక ఉన్న ఆంతర్యం.. అంటూ మరొకరు, ఇన్ డైరెక్ట్ గా ఎవరి గురించి చెబుతున్నారు సార్.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి గురించి నాగబాబు ఇలా కామెంట్ చేస్తూ ఎందుకు ట్వీట్ చేశారు.. అనే విషయం తెలియాల్సి ఉంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…