Nagababu : మెగా బ్రదర్ నాగబాబు ఇటు సినీ రంగం, అటు పొలిటికల్ రంగానికి సంబంధించిన ప్రత్యర్ధులపై బాణాలు విసురుతూనే ఉంటారు. ఛాన్స్ దొరికిన ప్రతిసారీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూనే ఉంటారు. మా ఎలక్షన్స్ సమయం నుండి మంచు వర్సెస్ నాగబాబు అన్న చందాన మారింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఆ మధ్య తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ 30వ వార్షికోత్సవంలో మోహన్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మంచు మనోజ్ మాట్లాడుతూ.. నాగబాబుపై ఇన్ డైరెక్ట్గా సెటైర్లు వేయడం హాట్ టాపిక్గా మారింది.
తన ఫ్యామిలీని నాగబాబు ఎలా టార్గెట్ చేశారో.. ట్రోలింగ్ చేయిస్తున్నారో తెలియజేస్తూ.. హయ్యర్ పర్పస్ సూత్రంతో నాగబాబుకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు మనోజ్. ఆ తర్వాత నాగబాబు కూడా హయ్యర్ పర్పస్ అనే పదాన్ని పదే పదే వాడుతూ చురకలంటించారు. అయితే ప్రస్తుతం ఇద్దరి మధ్య వివాదం నడుస్తూనే ఉన్న క్రమంలో ఓ నెటిజన్ ఆర్ఆర్ఆర్ లేదా కేజీయఫ్.. రెండింటిలో ఏది బాగుంది.. అంటూ ప్రశ్న సంధించాడు. దీనికి నాగబాబు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఈ రెండూ కాదు.. ఈ మధ్యే ఒక లెజెండరీ గ్రాఫిక్ సినిమా వచ్చింది.. అది బాగుందని.. అన్నారు. అది వాస్తవానికి మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమానే అని నాగబాబు ఇన్డైరెక్ట్గా సమాధానం ఇచ్చారు.
ఇక నాగబాబు ఆ కామెంట్స్ చేయడంతో ఆ సినిమా ఏంటో ఈజీగానే గెస్ చేశారు. అది మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమానే అని అందరూ అన్నారు. గతంలో కూడా మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండయాపై కూడా నాగబాబు సెటైర్స్ వేసిన విషయం తెలిసిందే. ఇక మంచు విష్ణుకి విరోధిగా మారిన హెయిర్ స్టైలిస్ట్ని కూడా నాగబాబు దగ్గరకు తీసుకున్న విషయం విదితమే. నాగ శ్రీను చాలా కాలంగా హీరో మంచు విష్ణు వద్ద హెయిర్ డ్రెస్సర్ గా పనిచేస్తున్నాడు. కాగా మంచు విష్ణు తన ఆఫీస్ లోని విలువైన హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రిని నాగ శ్రీను దొంగిలించాడు అంటూ కేసు పెట్టాడు. మంచు విష్ణు ఆరోపణలు ఖండించిన నాగ శ్రీను.. కులం పేరుతో దుర్భాషలాడటం, వేధించడంతో ఉద్యోగం మానేశాను అని అన్నాడు. అప్పుడు నాగబాబు అతడిని ఇంటికి పిలిచి 50 వేల రూపాయలు సహాయం చేశారు. అయితే నాగబాబు మళ్లీ మంచు ఫ్యామిలీపై సెటైర్స్ వేయడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…