Naga Shaurya Father : మంచిరేవుల పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ అరెస్టయ్యారు. ఆయన్ను ఉప్పర్పల్లి కోర్టులో నార్సింగి పోలీసులు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో శివలింగ ప్రసాద్ తరపు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఈ పేకాట కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను ముమ్మరం చేసిన పోలీసులు నాగశౌర్య తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.
హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ ఫాం హౌజ్ని 5 సంవత్సరాలు లీజుకు తీసుకున్నారు. ఆ తర్వాత గుత్తా సుమన్కు ఆ ఫామ్హౌస్ రెంట్కు ఇచ్చారు. ఈ క్రమంలో రెంటల్ అగ్రిమెంట్ తీసుకురావాలని శివలింగ ప్రసాద్ను పోలీసులు కోరుతూ నోటీసులు ఇష్యూ చేయగా, ఆయన స్పందించలేదు. రెంటల్ అగ్రిమెంట్ నిబంధనలు పాటించకపోవడం, నోటీసులకు స్పందించకపోవడంతో పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు.
క్యాసినో కింగ్పిన్ గుత్తా సుమన్తో కలిసి కొన్ని రోజులుగా నాగ శౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. దాంతో ఆయన అరెస్టు అనివార్యమైంది. నిన్నమొన్నటి వరకు నాగ శౌర్య తండ్రి పేరు ఈ కేసులో కాస్త తక్కువగానే వినిపించింది. అయితే ఇప్పుడు పోలీసులు సేకరించిన ఆధారాలతో ఆయన పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది . శ్రీరామ్ భద్రయ్య లాంటి మాజీ ఎమ్మెల్యేలతో పాటు.. నిజామాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాల నుంచి వచ్చిన బడాబాబులూ కూడా అందులో ఉన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…